అడుసు తొక్కనేల శంకరన్న...

Publish Date:Mar 4, 2013

Advertisement

 

మాజీ మంత్రి శంకరావు గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సోసైయిటీ కేసులో నేరెడ్ మెట్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో నేతలు ప్రళయం వచ్చినంత హడావుడి చేసారు. కానీ, అదే పార్టీకి చెందిన మోపిదేవి వెంకట రమణను జైల్లో చిరకాలంగా నిర్బందించినప్పటికీ, ఆ పార్టీలో స్పందించే నాదుడే లేడు.

 

శంకరావును అరెస్ట్ చేసి విడుదల కూడా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతలందరూ శంకరావు చేరిన ఆసుపత్రి ముందు క్యూలు కట్టి మరీ పరామర్శించి వచ్చారు. అందుకు కారణం వారు ఆయనపై జాలిపడుతున్నారనుకొంటే పొరబాటే అవుతుంది. ముఖ్యమంత్రిని వ్యతిరేఖించే నేతలే అనేకమంది శంకరవును పరామర్శించడం చూస్తే అసలు కధ తేటతెల్లమవుతుంది.

 

కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖిస్తున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటివారు, అదునుకోసం చూస్తున్నప్పుడు శంకరావు అరెస్ట్ జరిగింది. వెంటనే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వారందరూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపడుతూ శంకరావుకు మద్దతుగా నిలిచారు. తత్ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఐడీ కమిటినీ కూడా వేయవలసి వచ్చింది.

 

అయితే, శంకరావు మాత్రం మాత్రం వాపును బలుపనుకొని, మరింత రెచ్చిపోయి సీఐడీ సహకరించకపోగా, తన కుమార్తె చేత ముఖ్యమంత్రి, డీజీపి, ఇతర పోలీసు అధికారులపై కేసులు వేయించడమే కాకుండా, ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా లేఖలు కూడా వ్రాయించారు.

 

గ్రీన్ ఫీల్డ్ భాగోతంలో అయన తప్పులు చేసినట్లు కోర్టులు నమ్ముతున్న తరుణంలో, తన తప్పులను సరిచేసుకొనడమో లేక నేరుగా ముఖ్యమంత్రి శరణు కోరడమో చేసే బదులు, మరిన్ని తప్పులు చేయడంతో ఆయన పరిస్థితి కోరుండి కొరివితో తల గోక్కున్నట్లు తయారయింది.

 

ఆయనను అరెస్ట్ చేసే సమయంలో తమను దూషించారంటూ నేరెడ్ మెట్ పోలీసులు చేసిన పిర్యాదుతో అయన మరోమారు అరెస్ట్ అయ్యే సూచనలు కనబడగానే మళ్ళీ కోర్టుకు పరుగులు తీసి ముందస్తు బెయిలు తీసుకోవలసి వచ్చింది. అది గాక, సీఐడీ పంపిన నోటీసులకు జవాబు చెప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా గమనిస్తే ‘అడుసు తొక్కనేల కాలు కడుగనేల’ అనే పెద్దలమాట మనకి గుర్తుకురాక మానదు.

By
en-us Political News

  
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.