Publish Date:Aug 19, 2022
చేతిలో విద్య అంటూ ఉండాలేగాని ఎక్కడన్నా బతికేయొచ్చు అనేది పాతకాలంవారి మాట. పాత ఎప్పు డూ బంగారమే. బంగారం ఎప్పుడూ బంగారమే. బ్రిటన్ బ్రైటన్ నగరంలో 85 ఏళ్ల మంజులా పటేల్ హోటల్లో టిఫిన్ చేయకుండా అక్కడి వారికి ఒక్కరోజూ సరిగా గడవడంలేదంటారు. అదుగో అంతటి ఇష్టం ఆ టిఫిన్లు, ఆమె ఆతిథ్యం అంటే. అక్కడి సంప్రదాయ ఆహారపదార్ధాలేకాకుండా, భారత్ ఉత్తరాది వంటకాలతోనూ ఆమె అక్కడివారి మనసు గెలిచింది. ఆమెకు అందరి రుచులకు తగ్గట్టు చేసిపెట్టడంతో పాటు అందర్నీ తన పిల్లల్లానే చూస్తూ, పలకరించడం మహా సరదా. ఆమె ఈ ఆతిథ్యపు ప్రత్యేకతే ఇంగ్లీషు వారిని అమాంతం ఆకట్టుకుంది.
వాస్తవానికి ఆమె ఉగాండా కంపాలా నగరం నుంచి బ్రైటన్కు వచ్చిందేగాని మొదటి నుంచి ఇక్కడ స్థిర పడిన భారతీయ సంతతికి చెందినది కాదు. ఆమెది కావడానికి గుజరాత్. కానీ బాల్యంలోనే ఉగాండా వెళిపోయారు. ఆమె 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతను భరించాల్సి వచ్చిం ది. ఆ చిరుప్రాయంలో తానేమీ ఉద్యోగం చేయలేక తన నానమ్మ నుంచి అనేక రకాల వంటకాల గురించి తెలుసుకుంది. వారు వంట చేస్తున్నపుడు ఎలా చేస్తారు, ఎన్ని రకాలుగా వంట చేయవచ్చు అనేవి ఎంతో నేర్చుకుంది. అంతే తానూ అనేక రకాల టిఫిన్స్ తయారు చేయడంలో నిపుణురాలయి స్కూలు కు వెళ్లే పిల్లలకు బాక్స్లు సర్ది పెట్టేది. అనేక కార్యాలయాల్లో పనిచేవారికి తన చేతిరుచి చూపింది.
ఆమె వంటకా లకు అంతా ఫిదా అయ్యారు. క్రమేపీ ఆమె ఉగాండాలో మంచి రెస్టారెంట్ ఆరంభించారు. కానీ అన్నీ ఎల్లకాలం మనం అనుకున్నట్టు జరగవు గదా. ఉగాండాకి ఈదీ అమీన్ అనే రాక్షసుడు పాల కుడు అయిన తర్వాత అక్కడి పరిస్థితులు మొత్తం దెబ్బతిన్నాయి. దేశంలో ఆసియావాసులు ఆర్ధిక దోపి డీకి పాల్పడు తున్నారని అమీన్ ఆగ్రహించాడు. తక్షణం దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాడట. అంతే మంజు లాంటి వారు అనేకమంది ఉగాండా విడిచిపెట్టవలసి వచ్చింది.
అలా మంజు 1972 లో బ్రిటన్ చేరుకుంది. రాగానే చిన్న ఉద్యోగం కోసం విశ్వయత్నం చేసింది. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. కానీ ఆమె నిరాశపడలేదు. ఆమె తనకు తెలిసిన విద్యనే జీవనోపాధి మార్గంగా చేసుకుంది. అక్కడ పరిచయస్తులతో కలిసి రెస్టారెంట్ ఆరంభించింది. అది దినదినప్రవర్ధమానమై యావత్ బ్రైటెన్ ప్రజలు రెస్టారెంట్కి క్యూకట్టేలా చేయగలిగింది. ఇపుడు ఆమె కుమారుడు జేమిన్ పటేల్ చూస్తున్నాడు. ఇటీవలే మంజు 80వ పుట్టినరోజును రెస్టారెంట్లోనే వీరాభిమానుల మధ్య బ్రహ్మాండంగా జరిపాడు పటేల్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/selfconfidence-39-142242.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,