ఆంధ్ర, తెలంగాణాలలో మారిన రాజకీయ బలాబలాలు

Publish Date:Dec 30, 2013

Advertisement

 

మూడేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రకటన చేయగానే సీమాంధ్ర నేతలందరూ పార్టీలకతీతంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గక తప్పలేదు. సీమాంధ్ర నేతలు కేంద్ర నిర్ణయాన్ని సైతం మార్చగలగడంతో వారి శక్తిపై సీమాంధ్ర ప్రజలకు అపారమయిన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయి. ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్నతరుణంలో టీ-కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలు, జేయేసీలు కలిసి పనిచేస్తూనే ఒకరితో మరొకరు కీచులాడుకొంటుంటే, ఇంత అనైక్యంగా ఉన్నవీరు తెలంగాణా సాధించేనా? అని అందరూ పెదవి విరిచారు. సీమాంధ్ర నేతల శక్తి యుక్తులపై ప్రజలకున్నఅపార నమ్మకం వల్ల, తెలంగాణా ప్రజలు, పార్టీలు ఎంతగా పోరాడినా తెలంగాణా ఏర్పడే అవకాశం లేదనే ధీమా కూడా ఉండేది. బహుశః ఆ ధీమాతోనే అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి.

 

అయితే తెలంగాణా ప్రజల అలుపెరగని పోరాటాల వల్లనయితేనేమి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే సోనియా గాంధీ దృడసంకల్పం వల్లనయితేనేమి, రాష్ట్రంలో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలనే కాంగ్రెస్ దురాలోచన వల్లనయితేనేమి, సీమాంధ్ర మంత్రుల, యంపీల సహకారం వల్లనయితేనేమి మొత్తం మీద హటాత్తుగా రాష్ట్ర విభజనకి, తద్వారా తెలంగాణా ఏర్పాటుకి రంగం సిద్దమయిపోయింది.

 

అయితే మరి సర్వశక్తివంతులనుకొన్న సీమాంధ్ర నేతలందరూ ఈసారి ఎందుకు విఫలమయ్యారు? అనే ప్రశ్నకు జవాబు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందే కాంగ్రెస్ నేతలందరికీ తెలిసినప్పటికీ, వారిలో కొంతమంది మంత్రి పదవులకు, మరికొందరు పార్టీ టికెట్లకు, కాంట్రాక్టులకు అమ్ముడుపోయారనేది బహిరంగ రహస్యం. అంటే తెలంగాణా సాధనకు తెలంగాణా ప్రజల కృషి పట్టుదల ఎంత ఉందో, అందుకు సరిసమానంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు, నేతల సహకారం కూడా ఉందని అంగీకరించక తప్పదు. మళ్ళీ వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమను అన్యాయం చేసిందని వాపోతూ అద్భుతంగా నటిస్తున్నారు.

 

ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలో రాజకీయపార్టీల పరిస్థితి పూర్తిగా తారుమరయ్యింది. ఒకప్పుడు ఐకమత్యంగా ఉన్న సీమాంధ్ర నేతలు, పార్టీలు ఇప్పుడు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా విడిపోవడమే కాకుండా, సీమాంధ్రపై పట్టుకోసం ఎంతకయినా దిగజారేందుకు వెనకాడటం లేదు. వచ్చేఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ల కోసం, పార్టీలను, సిద్ధాంతాలను అన్నిటినీ పక్కనబెట్టి అటూఇటూ పరుగులు తీస్తున్నారు.

 

ఇక తెలంగాణాలో పార్టీల నేతలందరూ ఇంతవరకు వచ్చిన తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోనీయకూడదనే గట్టి పట్టుదలతో తమ విభేదాలను, పార్టీ జెండాలను కూడా పక్కనబెట్టి సమైక్యంగా ముందుకు కదులుతున్నారు. వారు ఇప్పుడు సీమాంధ్ర నేతలను ఎదుర్కోవడం తమకు పెద్ద సమస్య కాదనే పూర్తి నమ్మకంతో ఉన్నారు. సీమాంధ్ర నేతలలో చిత్తశుద్ధి కొరవడిందనే సంగతి గ్రహించడమే అందుకు కారణం.

 

తెలంగాణా బిల్లుని శాసనసభలో ఓడిస్తామని, లేకుంటే పార్లమెంటులో ఓడిస్తామని, ఇంకా కుదరకుంటే రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించి ఆయన మనసు మార్చేస్తామని, లేకుంటే సుప్రీం కోర్టులో కేసులు వేసి ఆపేస్తామని ఇలా ఏవేవో కట్టు కధలు, పిట్ట కధలు సీమాంధ్ర నేతలు చెపుతూనే ఉన్నారు. అయితే వారి అసలయిన లక్ష్యం రాష్ట్ర విభజనను ఆపడం కాదు. ఆపడానికి తాము మాత్రమే చాలా గట్టిగా కృషి చేసామని చెప్పుకొంటూ వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడమే. మొన్న శాసనసభ సమావేశాలప్పుడు వారందరూ ప్రవర్తించిన తీరు అనుసరించి వ్యూహాలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. 

 

ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సాగుతున్నఈ వికృత రాజకీయ క్రీడని బహుశః రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా ఎన్నికలు పూర్తయ్యేవరకు వారు ఆడుతూనే ఉంటారు. అందుకు ప్రజలు తగిన ప్రతీకారం తీర్చుకోదలిస్తే తమను ఇంతగా మోసం చేసినవారు ఏ పార్టీలో చేరినా వారిని నిర్దాక్షిణ్యంగా ఓడించడమోకటే మార్గం.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.