లక్ష్యాన్ని చేరుకునే చిట్కా

Publish Date:Aug 13, 2018

Advertisement

 

మనిషన్నాక రకరకాల లక్ష్యాలు ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే తాము ఏర్పరుచుకున్న గోల్స్‌ని చేరుకుంటారు. వాళ్లే విజేతలుగా నిలుస్తారు. మిగతావారంతా తమకి దొరికన దాంతో సంతృప్తి పడిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే అనుమానం వచ్చింది కొంతమంది పరిశోధకులకి. అంతే! వెంటనే ఓ పరిశోధన మొదలుపెట్టేశారు. అందులో తేలిన విషయాలు మనందరికీ ఉపయోగమే. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటంటే....

మనలో చాలామంది లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ‘రేపటి నుంచి రోజూ పొద్దునే లేవాలి’ అనే గోల్‌ సెట్ చేసుకునే ఉంటారు. కానీ అదేం చిత్రమో కానీ ఎప్పుడు అలా అనుకున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. మొదటి రోజు రాత్రి పడుకోవడం లేట్‌ అవుతుంది, రెండోరోజు ఎవరో చుట్టాలు ఇంటికి వస్తారు, మూడో రోజు రాత్రి అసలు నిద్రే పట్టదు... ఇలాంటి కారణాలతో ఏ రోజుకి ఆ రోజు పొద్దున లేవడం కుదరనే కుదరదు. దాంతో ఇక ఆ గోల్‌ని పక్కన పెట్టేస్తారు. ఇలా గోల్‌ సెట్‌ చేసుకున్న తర్వాత వరుసపెట్టి ఇబ్బందులు తలెత్తడాన్ని ACTION CRISIS అని పిలుస్తారట. ఈ యాక్షన్‌ క్రైసిస్‌లో ఏం జరుగుతుంది. దాన్ని overcome చేయడం ఎలా అనే దిశగా పరిశోధకులు ఆలోచించారు.

ఈ పరిశోధన కోసం వాళ్లు కొంతమంది వ్యక్తులకు వేర్వేరు గోల్స్ ఇచ్చారు. వాటిని సాధించే క్రమంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్లకి ఎలాంటి ఆలోచనలు ఏర్పడ్డాయో చెప్పమన్నారు. ఆశ్చర్యంగా గోల్‌ ఏదైనా కూడా, అందులో ఇబ్బందులు తలెత్తినప్పుడు ఒకే తరహా ఆలోచనలు వచ్చాయట. ‘అసలు ఈ గోల్‌ చేరుకోవాల్సిన ఉపయోగం ఉందా?’ అన్న అనుమానం మొదలైంది.

అప్పటివరకూ గోల్‌కి ఉన్న లాభాల గురించి ఆలోచించినవాళ్లంతా, దానికి సంబంధించిన నష్టాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకటికి రెండు ఇబ్బందులు రాగానే తాము లక్ష్యం చేరుకోగలమనే నమ్మకాన్ని కోల్పోయారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా ఏం చేయాలని ఆలోచించడం బదులు, దాన్ని ఎలా వదిలించుకునే మార్గాలు వెతకడం మొదలుపెట్టారు. దాంతో ఇక లక్ష్యం నిదానంగా కరిగిపోతుంది. ACTION CRISIS ఏర్పడినప్పుడు నిబ్బరంగా ఉండగిలిగితేనే లక్ష్యాన్ని సాధించగలం అని పరిశోధకులు తేల్చారు. ఆ కాస్త సమయంలో లక్ష్యాన్ని దూరం చేసుకోవడం కంటే, దాన్ని ఎలాగైనా సాధించేందుకు ఉపాయాన్ని ఆలోచించగలిగితే గోల్‌ రీచ్ అవ్వగలం. ఇందులో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తితో పాటు... అతని చుట్టుపక్కల ఉండే స్నేహితులు, టీచర్లు, కుటుంబం పాత్ర కూడా చాలా ఉందట. వాళ్ల ప్రోత్సాహం, సహాయం ఉంటే కనుక నమ్మకం చెదిరిపోకుండా ఉంటుందట.

- నిర్జర.

 

By
en-us Political News

  
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది.
మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం.
విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు.
ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది.
పిల్లలు ఎదిగే కొద్దీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా తామూ కనెక్ట్ అవుతారు.
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా..
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా..
స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది.
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం, బంధువులకు దూరంగా.. కొత్త జంట ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన సమయం పొందుతారు....
ఇంజనీర్, సామాజిక కార్యకర్త, రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి, సామాజిక సమస్యలపై మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.