Publish Date:Apr 18, 2024
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్, బీజేపీల రహస్య బంధం గురించిన ఆరోపణలు చేయడమే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ గూటికి చేరిపోతారనీ, తనతో పాటుగా తన వర్గానికి చెందిన ముప్ఫై మందిని తీసుకుని మరీ కమలం గూటికి చేరుతారని ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఒక అడుగు ముందుకు వేసి వంద మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే బీజేపీ బీఆర్ఎస్ ను నానా ఇబ్బందులూ పెట్టిందనీ, ఇప్పుడు జస్ట్ 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న రేవంత్ సర్కార్ ను బీజేపీ బతకనీయదనీ అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన కౌంటర్ బీఆర్ఎస్ నే కాదు.. బీజేపీని ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అమిత్ షానే ఇరుకున పెట్టి డిఫెన్స్ లో పడేలా చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మద్యం కేసు నుంచి బయట పడేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనీ, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలలో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపిందనీ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రెండు పార్టీల మధ్యా రహస్య ఒప్పందం లేకపోతే కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు భువనగిరి, చేవెళ్లు, జహీరాబాద్, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారం చేయలేదని సూటిగా ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నిలదీస్తున్నారు.
రేవంత్ ఆరోపణలు విమర్శలకు ఆశ్చర్యకరంగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ గట్టిగా ఖండనలు రాలేదు. రెండు పార్టీలూ కూడా అతి జాగ్రత్తకు పోయి రేవంత్ విమర్శలపై నోరెత్తకుండా ఉండటమే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ తెలంగాణలో అధమ పక్షం పది స్థానాలలో విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది.
ఈ సమయంలో రేవంత్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం విమర్శలు ఆ పార్టీని ఒకింత చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్, మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజ కవర్గాలలో బీఆర్ఎస్ బలహీనతలు బీజేపీకే కలిసివస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ విమర్శలపై స్పందించి పరిస్థితిని కంగాళీ చేసుకోవడం కంటే మౌనమే మేలన్న వ్యూహంతో బీజేపీ ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/secret-agreement-between-brs-andbjp-39-174117.html
‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు
ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.