Publish Date:Aug 25, 2022
టీచర్ కొడుతున్నాడని బడి మానేయడం, ట్యూషన్లే మేలని టీచర్ మానేయడం.. ఈ కారణా లతోనే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికే చాలా పాఠశా లలు మూసివేత స్థితికి వచ్చా యని విద్యారంగ నిపుణులు విమ ర్శిస్తున్నారు. అసలీ పరిస్తితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేసే వ్యూహాలు పకడ్బందీగా అమలు చేయడం అన్నది పోయిందనేదీ అనేకమంది విమర్శకుల మాట. ఇది ఎంతో నిజమని పిల్లల తల్లిదండ్రులూ అంటున్నారు.
అస్సాంలో ఇటీ వలి పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 34 పాఠశాలల్లో ఏ ఒక్క విద్యార్ధీ ప్యాస్ కాలేదు. ఇది ఇక్కడి విద్యాబోధన, పాఠశాలల పరిస్థి తులకు అద్దం పడుతుంది. ఇలాంటి స్థితి ఎన్నాళ్లుగానో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం ఇపుడు వాటి మూసివేతకు ప్రభుత్వాలే ఆదేశాలు జారీ చేయడం విచారకరం.
తరగతి గదులు సరిగా లేకపోవడం, విద్యాబోధనకు సరయిన వాతావరణం లేకపోవడం, విద్యార్ధులను బడికి తీసుకువచ్చేట్టు చేయడంలో అధికారులు, తల్లిదండ్రులు విఫలం కావడం వంటి అనేకం ఇప్పటి పలితాలకు కారణాలు కావచ్చు. ఉపాధ్యాయులు బడికి దూరంగా ఉండడం, రాకపోకలు, సాదకబాధకాల్లో విద్యార్ధులు నష్టపోతున్నారనే అనాలి. దీనికి సరయిన పరిష్కారాలు ఆలోచించి అమలు చేయాలి. అంతేగాని పాఠశాలలు మూసివేయడం సరయిన నిర్ణయం కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అభిప్రాయపడ్డారు. పాఠశాలలను మెరుగుపర్చడం ఒక్కటే మళ్లీ విద్యార్ధులకు చదువు పట్ల, ఫలితాలపట్ల దృష్టి మళ్లించగలదని ఆయన అన్నారు. పాఠశాలలు మూసివేయడం విద్యార్ధులను, పిల్లలను బడికి మరింత దూరం చేస్తుందన్నది ప్రభుత్వాలు గ్రహించాలన్నారు కేజ్రీవాల్.
విద్యార్ధుల సంఖ్యను, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వారికి మెరుగైన అవకాశాలు, పరిస్థి తులు కల్పించాలన్నది విద్యాధికుల మాట. ఏ ప్రాంతంలోనయినా విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు మధ్య విభేదాలు, దూర భారాలు పెరగకుండా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి విద్యార్ధుల్లో మరింత పెంచేలా బోధనా విధానం ఉండాలన్నది విద్యా వేత్తలు అనాదిగా చెబుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/schools-need-to-be-shutdown-39-142616.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.