అత్యాచార నేరానికి దౌత్యవేత్తలకు మినహాయింపు ఉంటుందా?

Publish Date:Sep 18, 2015

Advertisement

 

చమురు బావులతో సంపన్న దేశంగా మారిపోయిన సౌదీఅరేబియాలో నేటికీ రాజరిక వ్యవస్థే కొనసాగుతోంది. అక్కడ చట్టాలు చాలా కటినంగా అమలు చేస్తుంటారు. అందుకే అక్కడ నేరాలు, అవినీతి కూడా చాలా తక్కువే. అటువంటి దేశం నుండి డిల్లీకి వచ్చిన దౌత్యవేత్త మజీద్ హసన్ అసుర్ తన ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తున్న నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలను గత రెండు మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తను అత్యాచారం చేయడమే కాకుండా తన ఇంటికి వచ్చిన తన స్నేహితులకు కూడా ఆ మహిళలను అప్పజెప్పేవాడు. ఆ నేపాలీ మహిళలు ఇద్దరూ ఎలాగో అతికష్టం మీద తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ అతనికి దౌత్యపరమయిన రక్షణ ఉపయోగించుకొని అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాడు. సౌదీ ప్రభుత్వం అతనిని తక్షణమే స్వదేశానికి తిరిగి రప్పించుకొని అతనిని కాపాడింది.

 

ఒకవేళ ఇదే నేరం సౌదీఅరేబియాలోనే జరిగి ఉండి ఉంటే సౌదీ ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా ఆ నేరానికి పాల్పడిన వ్యక్తికి మరణ దండన అమలుచేసి ఉండేది. కనుక భారత చట్టాల ప్రకారం తన దౌత్యవేత్తను కూడా శిక్షించేందుకు సౌదీ ప్రభుత్వం సహకరించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ దౌత్యవేత్తగ తన దేశ పేరు ప్రతిష్టలు ఇనుమడించేలా చాలా హుందాగా వ్యవహరించవలసిన అసుర్ చాలా తీవ్రమయిన నేరం చేస్తే, అతనిని కాపాడే ప్రయత్నం చేసి సౌదీ ప్రభుత్వం అంతకంటే పెద్ద తప్పు చేసినట్లయింది. తమ దేశంలో అమలు చేసే చట్టాలు, శిక్షలు కేవలం సామాన్య పౌరులకే కానీ మజీద్ హసన్ అసుర్ వంటి దౌత్యవేత్తలకి వర్తింపజేయదని చాటుకొన్నట్లు అయింది.

 

తమ దేశానికి చెందిన మహిళలపై భారత్ లోనే అత్యాచారం జరిగింది కనుక భారత్ చట్టాల ప్రకారం వారికి న్యాయం చేయాలని నేపాల్ కోరుతోంది. ఈ నేరం చేసిన సౌదీ దౌత్యవేత్తతో బాటు అతనితో ఈ నేరంలో పాల్గొన్న వారందరిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని నేపాల్ ప్రభుత్వం కోరుతోంది. నేపాల్ ఆ విధంగా కోరడంలో సహజమే. కానీ ఆ సౌదీ అసురుడు తనకున్న దౌత్య కవచాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పటికే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇక అతనిని వెనక్కి రప్పించి శిక్షించడం దాదాపు అసంభవమేనని చెప్పక తప్పదు.

 

అనేక కారణాల వలన భారత్-నేపాల్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సౌదీ దౌత్యవేత్త, సౌదీ ప్రభుత్వం చేసిన ఈ తప్పుల వలన నేపాల్ ప్రభుత్వానికి భారత్ సంజాయిషీలు ఇచ్చుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇరు దేశాల సంబంధాలు దెబ్బ తింటున్నాయి. సౌదీ అరేబియా దేశంలో లక్షలాది భారతీయులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు. కనుక భారత ప్రభుత్వం సౌదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగలేదు. అలాగని ఇంత హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిని ఉపేక్షించలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భారత్ ఉందిప్పుడు. దౌత్యవేత్తగా అతనికి వియన్నా ఒడంబడిక ప్రకారం రక్షణ కలిగి ఉంటాడు కనుక భారత్ అతనిని అరెస్ట్ చేయకూడదని సౌదీ వాదించింది. కానీ అటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తికి శిక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ భారత్ చట్టాలను మాత్రం అది గౌరవించాలనుకోవడంకోలేదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.