Publish Date:Apr 22, 2022
గుడివాడ మండలంలో ఇసుక మాఫియా వీరంగం సృష్టించింది. ఏకంగా ఆర్ఐ మీదే దాడికి యత్నించింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆర్ఐ ప్రాణాలతో బైటపడ్డారు. వైకాపా దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా గుడివాడ అంటే అక్కడ వైకాపా మాజీ మంత్రి కొడాలి నానిదే హవా!
వాస్తవానికి ఆర్ఐపై దాడి చేసినది నానీ గ్యాంగేనని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. సంఘటన జరిగిన తీరును బట్టి అధికార పార్టీ దన్ను లేకుండా ఈ దాడి జరిగే అవకాశమే లేదని అంటున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే...
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ ఇసుక మాఫియా రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఆర్ఐ అరవింద్ అక్కడకు ఇద్దరు సిబ్బందిలో వెళ్లారు. అక్రమ ఇసుక తరలింపును, తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మాఫియాదారులు ఆర్ఐను అడ్డుకోవటమే కాకుండా దాడికి దిగారు. ఏకంగా జేసీబీతో తొక్కించే ప్రయత్నం చేశారు. జేసీబీతో పక్కకు నెట్టివేశారు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో మాఫీయా గ్యాంగ్ పలాయనం చిత్తగించింది. ఈ దాడిపై ఆర్ఐ అక్రమ ఇసుక తవ్వకాలను ను అడ్డుకొనేందుకు ఇద్దరు సిబ్బందితో తాను వెళ్లానని, తనపై పలువురు దాడికి దిగారని, జేసీబీపీ జేసీబీతో నెట్టివేసే ప్రయత్నం చేశారన్నారు. ఆర్ఐపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇక తెలుగుదేశం ముఖ్యమంత్రి అండతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదని ఆరోపణలు చేస్తున్నారు. కొడాలి నాని ప్రత్యక్ష ప్రమేయంతోనే మాఫియా గుడివాడ మండలంలో రెచ్చిపోతున్నదన్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పశువుల కొట్టంలో కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్న కొడాలి చేస్తున్నది ఇసుక అక్రమ దందాయేనని విమర్శిస్తున్నాయి. కాగా ఆర్ఐపై దాడి జరిగిన స్థలాన్ని తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. వైకాపా అండతోనే, వారి దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, అధికారులపై దాడులకు సైతం వెరవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
గత నెళ్లాళ్లుగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోలేదనీ, కొడాలి నాని, ఆయన అనుచరుల అరాచకాలకు హద్దు, అడ్డు, అదుపూ లేకుండా పోయిందనీ, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sand-mafia-attack-on-rikodali-nani-behind-the-attack-39-134770.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.