అది సుప్రీం తీర్పుని ప్రశ్నించడమే!

Publish Date:Jul 27, 2015

Advertisement

 

ముంబై ప్రేలుళ్ళ కేసులో ప్రధాన పాత్రధారి యాకుబ్ మీమన్ కి ఈనెల 30న నాగపూర్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు వార్త వెలువడగానే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా “అతనిని ఉరి తీయవద్దు, ఆ నేరానికి పాల్పడిన అతని సోదరుడు టైగర్ మీమన్ని ఉరి తీయండి” అని ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు.

 

ఊహించినట్లే దానిపై సర్వత్రా నిరసనలు వెలువెత్తాయి. దానితో ఆయన మళ్ళీ మరొక ట్వీట్ మెసేజ్ లో, “యాకూబ్ మెమన్ నిర్దోషి అని నేను కూడా భావించడం లేదు. కానీ అన్నకి బదులుగా తమ్ముడు ఉరికంబం ఎక్కుతున్నాడనే ఉద్దేశ్యంతో మానవతా దృక్పదంతోనే అతనిని ఉరి తీయవద్దని కోరాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. మన న్యాయవ్యవస్థల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ముంబై బాంబు ప్రేలుళ్ళలో అనేకమంది అమాయకులయిన ప్రజలు చనిపోయారు. ఒక్క మనిషి ప్రాణం పోయినా అది మానవత్వానికి మచ్చ వంటిదేనని ఇది వరకు చాలాసార్లు చెప్పాను. ఆ ఉద్దేశ్యంతోనే యాకుబ్ కి ఉరి వద్దన్నాను. కానీ ఉద్దేశ్యపూర్వకంగా ఆవిధంగా అనలేదు. ఒకవేళ నా అభిప్రాయలు ఎవరి మనసులనయినా నొప్పించి ఉంటే వారందరికీ బేషరతుగా క్షమాపణలు చెపుతున్నాను,” అని అన్నారు.

 

రాజకీయాలలో ఉన్న అసదుద్దీన్ వంటి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనినొక అవకాశంగా వాడుకోవడం సహజం. కేవలం హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమయిన తన మజ్లీస్ పార్టీని యావత్ రాష్ట్రంలో ఇంకా వీలయితే యావత్ భారతదేశంలో విస్తరించాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ చాలా కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకు యాకుబ్ మీమన్ ఉరి శిక్షని వ్యతిరేకిస్తూ గట్టిగా వాదిస్తుండవచ్చును. కానీ ప్రజలు, రాజకీయ పార్టీలు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల స్పందించినట్లుగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించడం లేదనే విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంది. అందుకు కారణం అసదుద్దీన్ రాజకీయాలలో ఉండటం సల్మాన్ సినీ పరిశ్రమలో ఉండటమే. ఒకవేళ సల్మాన్ ఖాన్ కి ఎదురయిన పరిస్థితే అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఎదురయి ఉండి ఉంటే అప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ లాగ క్షమాపణలు చెప్పే బదులు దానిని కూడా మరొక రాజకీయ అవకాశంగా మలుచుకొనేందుకు తప్పకుండా ప్రయత్నించేవారని చెప్పవచ్చును.

 

రాజకీయ నేతలకీ, సినీ హీరోలకి ఉన్న చిన్న తేడా అదే! ఆ విషయం తెలుసుకోకుండా నటుడు సల్మాన్ ఖాన్ అనవసరంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి కోరుండి సమస్యలు కొని తెచ్చుకొన్నారు. కానీ ఆయన వంటి ప్రముఖులు కూడా భారతీయ న్యాయవ్యవస్థ తీర్పుపై ఈవిధంగా అనుమానాలు వ్యక్తం చేయడం సబబు కాదు. భారతీయ న్యాయవ్యవస్థలో ఎన్నో లోపాలు, చట్టాలలో ఎన్నో లొసుగులు ఉండవచ్చు గాక. కానీ వందలాది ప్రజలను అతి కిరాతకంగా కాల్చి చంపిన అజ్మల్ కసాబ్ లేదా పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురు లేదా ముంబై వరుస ప్రేలుళ్ళలో సుమారు 250 మంది ప్రజల ప్రాణాలు బలిగొన్న యాకుబ్ మీమన్ కావచ్చు...ఎంత కరుడు గట్టిన నేరస్థుడికయినా తను నిర్దోషి అని నిరూపించుకొనేందుకు మన న్యాయ వ్యవస్థ అవకాశం ఇస్తుంది.

 

అందుకే దేశంలో కోట్లాది మంది పసి పిల్లలు, వృద్దులు, ఆనాధలు తిండి, గుడ్డ, గూడు, విద్య, వైద్యం లేక రోడ్లపైనే బ్రతుకుతున్నా కసాబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మీమన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులు శిక్ష అమలయ్యే వరకు కూడా సమస్త రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు. రెండు మూడు నెలల్లో తేలవలసిన కేసులని రెండు మూడు దశాబ్దాలపాటు పొడిగించ గలుగుతున్నారు. వందలాది మంది ప్రజల ప్రాణాలను హరించిన అటువంటి కిరాతకులని ఉరి తీస్తే అది మానవత్వానికే మచ్చ అని సల్మాన్ ఖాన్ వంటి వ్యక్తి చెప్పడం చాలా తప్పు. అది ఖచ్చితంగా మన న్యాయవ్యవస్థల తీర్పులను అవమానించడమే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.