స్పాట్ ఫిక్సింగ్ పై సచిన్, ధోని స్పందన

Publish Date:May 31, 2013

Advertisement

 

క్రికెటర్లకు, బీసీసీఐ బోర్డుకు కోట్ల రూపాయలు వర్షం కురిపిస్తున్న ఐపియల్ మ్యాచులలో బయటపడిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు తెర వెనుకున్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, బాలివుడ్ నటుడు విందూ ధారా సింగ్ వంటి పెద్ద తలకాయలను బయట పెట్టడంతో క్రికెట్ అభిమానులు షాకయ్యారు. అల్లుడు ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తున్నపటికీ, బోర్డు అధ్యక్ష పదవిని వదిలి పెట్టేదిలేదని శ్రీనివాసన్ గట్టిగా చెపుతుండటంతో, అటువంటి వారి నేతృత్వంలోనడుస్తున్న క్రికెట్ మ్యాచులపై అభిమానులకు నమ్మకం సడలుతోంది.

 

ఇక ఈ విషయంలో స్పందించవలసిన హేమా హేమీలయిన క్రికెట్ ఆటగాళ్ళు సైతం అనవసరంగా కలుగజేసుకొని తమ అవకాశాలను పాడుచేసుకోవడం ఎందుకని అనుకోన్నారో ఏమో ఎవరూ ఈ విషయం పై నోరు విప్పలేదు.

 

అయితే లండన్ పర్యటనలో ఉన్న ఇండియన్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడటం మంచిదికాదని నేను భావిస్తున్నాను. దీనిపై సరయిన సమయంలో నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం కొందరు ఆటగాళ్ళు మానసికంగా మిగిలిన వారికంటే కొంచెం బలహీనంగా ఉండటేనని నేను భావిస్తున్నాను. ఇంత కంటే ప్రస్తుతం ఎక్కువ మాట్లాడలేను,” అని అన్నారు.

 

ఇక, ఇటీవలే ఐపియల్ మ్యాచుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ, లక్షలాది ప్రజలు అభిమానించే క్రికెట్ ఆటలో ఇటువంటివి జరగడం నిజంగా నాకు చాల బాధ కలిగిస్తోంది. ఇటువంటి ఆరోపణలతో క్రికెట్ ఆట మీడియా కెక్కిన ప్రతీసారి నాకు చాల బాధ కలుగుతుంది. మేము బాగా ప్రాక్టీస్ చేసి, ఆడి విజయం సాదించాలని మాత్రమే మాకూ శిక్షణలో నేర్పబడుతుంది. ఆటలో ఓడినా గెలిచినా క్రీడాస్పూర్తి నిలపడం చాల ముఖ్యమని మాకూ శిక్షణలో చెప్పబడింది. కానీ, ఇటువంటి వ్యవహారాల వల్ల ఆటకు చెడ్డ పేరు రావడమే కాకుండా, లక్షలాది అభిమానుల నమ్మకం కూడా వమ్ము చేసినట్లవుతుంది. ఇప్పటికేయినా సమూల ప్రక్షాళన చేసి ఆటకు పునర్ వైభవం తీసుకువస్తే అందరూ సంతోషిస్తారు.”

 

ధోనీ ఆటగాళ్ళ బలహీనతలే ఇటువంటి అవినీతి పనులకు అవకాశం ఇస్తాయని అభిప్రాయ పడితే, క్రికెట్ బోర్డులో చోటుచేసుకొన్న రాజకీయాలను, తద్వారా ఆటను సమూల ప్రక్షాళణం చేయడమే దీనికి పరిష్కారమని సచిన్ అభిప్రాయ పడ్డారు.

By
en-us Political News

  
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి, ప్రస్తుతం తిహార్ జైల్లో వున్నారు
మొన్నటి వరకు యువతరాన్ని పబ్జీ పిచ్చి పట్టి పిడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్ లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్న మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు.
చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.
పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.