Publish Date:Aug 13, 2022
తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి గోపాల్రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరినప్పటి నుంచి పార్టీలో అంతా ఖంగారుగానే ఉంది. తెలంగాణాలో టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొని నిలవడానికి పార్టీ మరింత పటిష్ట చేయడంలోనూ తెలంగాణా ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆశించినంత పటిష్ట వ్యూహాలేమీ వేయడం లేదు. దీనికి తోడు ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయ కులను అందరినీ సమానంగా చూస్తూ, అందరి అభిప్రాయాలు తెలుసుకుని ముందడుగు వేయ డంలోనూ వెనకబడి పోతున్నారన్న అభిప్రాయాలే వినవస్తున్నా య ని విశ్లేషకులు మాట. ఆయన మీద అనేక ఫిర్యాదులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి చేరాయి. ఆయన కేవలం పీసీసీ అధ్యక్షుడితో తప్ప వేరే నేతలను పట్టించుకోవడంలేదన్న అభిప్రా యాలు ఉన్నాయి.
పార్టీ నాయకుల్లో ఆయన పట్ల తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మునుగోడు కేంద్రందంగా బీజేపీ వ్యూహరచనతో ముంద డుగు వేస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు సరైన సూచనలనిస్తూ ఉత్సాహపర్చకుండా, వారి అభిప్రాయాలను లెక్క లోకీ తీసుకో కుండా కేవలం పీసీసీ అధ్యక్షుడితోనే చర్చిస్తూండడం పట్ల నాయకులు మండిపడుతున్నారు. మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి తో చాలామంది నాయకులు విసిగెత్తి పార్టీని వదిలేసి వెళ్లే ఆవకాశాలు కనపడుతున్నాయని ఇప్పటికే కొందరు సీనియర్లు ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
ఈ సమయంలో మాణిక్కం ఠాగూర్ను మార్చి సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్కు గానీ మరో నేతను గానీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి మాణిక్యం వైఖరివల్ల పార్టీ మారాల్సివచ్చిందని తెలుస్తోంది. అనేకమంది నేతలు ఢిల్లీలో సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తున్నా రని, దీనితో ఠాగూర్ ఏమి చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు ప్రశ్నించి నట్లు తెలిసింది. కాగా ప్రియాంక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమిస్తారన్న వదంతులు ఉన్నాయి. అయితే అది ఎంతవరకూ సాకారమవుతాయన్నది అనుమానమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sachin-pilot-to-replace-manikkam-takur-39-141887.html
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.