రుషికొండ ప్యాలెస్.. ఇక లగ్జరీ రిసార్ట్‌!?

Publish Date:Jun 18, 2026

Advertisement

మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్ల  విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు చూసినా లక్షల రూపాయల ఖరీదు..  ఇదీ జగన్ తన హయాంలో జనం సొమ్ముతో నిర్మించిన రుషికొండ ప్యాలస్.  విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మానం అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పటి ముఖ్యమంత్రి తన విలాస నివాసం కోసం ప్రజాధనంతో నిర్మించుకున్న ప్యాలెస్.  గత ఐదేళ్లుగా పేదల కోసమే తన ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్ హయాంలో నిర్మితమైన పెత్తందారీ ప్యాలెస్ రుషికొండ ప్యాలెస్.  వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన  ఈ రాజసౌధం కేవలం తన కోసం నిర్మించుకున్నారు.  జగన్ ఐదేళ్లలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ రుషికొండ ప్యాలెస్.   452 కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలు కట్టారు. ఇందు కోసం ఏకంగా రుషికొండకు బోడి గుండు కొట్టించారు.   12 బెడ్ రూములు, ఒక్కో బెడ్ రూమ్ కూ  అటాచ్ బాత్రూం,  అత్యంత ఖరీదైన ఫర్నీచర్.. మళ్లీ అధికారం తనదేనన్న నమ్మకంతో తన కోసం జగన్ నిర్మించుకున్న ఈ ప్యాలెస్ కోసం  గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు.

జగన్ నివాసంతో పాటు సీఎం కార్యాలయం కోసం ఈ భవంతులను కట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ డాలర్లు వెచ్చించి కొట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నేలా రుషికొండ ప్యాలెస్ ను నిర్మించారు.  2024లో వైసిపి ఓడిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ నిర్మించిన రుషికొండ ప్యాలెస్ బాగోతం బయటపడింది. అంతకు ముందు.. అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  రుషి కొండవైపుగా  చీమ కూడా వెళ్లే అవకాశం కూడా లేనంతగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందలాది మంది పోలీసులను మొహరించి అడ్డుకుంది అప్పటి జగన్ సర్కార్.

ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న దానిపై మల్లగుల్లాలు పడింది.  ఈ భవనాల నిర్వహణ ఖర్చులు సామాన్యమైనవి కావు. కేవలం ఈ భవన సముదాయం నిర్వహణ కోసం నెలనెలా పాతిక 25 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. అంతేకాకుండా.. లోపల ఉన్న అత్యంత విలువైన వస్తువులను, అత్యాధునిక ఇంటీరియర్స్‌ను భద్రపరచడానికి, మెయింటైన్ చేయడానికి ఏకంగా   1.5 కోట్ల భారీ వ్యయం అవుతోంది.

దీంతో ప్రజాధనం వృధాను అరికట్టడానికీ, దానిని ప్రభుత్వానికి ఆదాయవనరుగా వినియోగిం చుకునేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీ వేసింది. చివరకు ఆ కమిటీ  ఈ ప్యాలెస్ ను   లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని   నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి అధికారిక సిఫార్సులు చేయాలని నిర్ణయించింది.  

 అంతకు ముందు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తెలుగుదేశం కూటమి  ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది.  ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కొంతమంది దీనిని మానసిక వైద్యశాలగా మార్చాలని, మరికొందరు స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉంచాలన్నారు పేర్కొన్నారు. చాలా మందైతే రుషికొండ ప్యాలెస్ ను కూల్చేయాలని సూచించారు.  అయితే, మెజారిటీ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను,  విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, దీనిని ఒక ప్రతిష్టాత్మక హాస్పిటాలిటీ  ప్రాజెక్టుగా మార్చడమే సరైన మార్గమని కమిటీ భావించింది. 

By
en-us Political News

  
పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం..
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్ష వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐపీఓ (Leapfrog Engineering SME IPO) నేటితో ముగియనుంది. తాజా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), లాట్ సైజ్ మరియు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి.
క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జీలు లేదా MDR అంటే ఏమిటి? 1% నుండి 3% వరకు ఉండే ఈ అదృశ్య రుసుములు మీ జేబును ఎలా ప్రభావితం చేస్తాయో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
బ్యాంకుల్లో లిక్విడిటీ నిల్వలు రూ. 4,772 కోట్లకు పడిపోవడంతో ఆర్‌బీఐ రూ. 1 లక్ష కోట్ల వేలాన్ని ప్రకటించింది. ఈ వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లేబనాన్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన ఆలస్యం కావడం, $300 బిలియన్ల నిధిపై వివాదం మరియు హార్ముజ్ జలసంధి పరిణామాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ (PM SHRI) నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణం, విద్యార్థినుల కోసం 53 వేల బంక్ బెడ్ల ఏర్పాటు మరియు అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారా లోకేష్ తీసుకున్న కీలక నిర్ణయాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో సౌత్ కొరియాపై 1-0 విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో సంచలన రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్టాక్ మార్కెట్ క్రాష్‌లోనూ అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3 శాతానికి పైగా దూసుకెళ్లాయి. ఒప్పో ఇండియాతో కుదిరిన మొబైల్ తయారీ ఒప్పందం ఈ భారీ ర్యాలీకి ఎలా కారణమైందో, ఈ మల్టీబ్యాగర్ రిటర్న్స్ వివరాలను ఇక్కడ చూడండి.
ప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జూన్ 19న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 780 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,000 స్థాయిని కోల్పోయింది. కేవలం నిమిషాల్లో రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఎలా ఆవిరైంది, యాక్సెంచర్ ఇచ్చిన షాక్ ఏంటి, ఐటీ షేర్లు ఎందుకు పతనమయ్యాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.