రుషికొండ ప్యాలెస్‌లు కూల్చేయాలి.. కేంద్రానికి లేఖ!

Publish Date:Jun 27, 2024

Advertisement

విశాఖలోని రుషికొండ మీద వెలసిన వివాదాస్పద కట్టడాలు జగన్ ప్రభుత్వ తెలివితక్కువ తనానికి నిదర్శనంగా నిలిచి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కట్టడాలను ఎలా ఉపయోగించుకోవాలో అర్థంకాక చంద్రబాబు ప్రభుత్వం బుర్ర వేడెక్కుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జనం రకరకాల సూచనలు చేస్తున్నారు. అయితే రుషికొండ ప్యాలెస్‌లను కూల్చాలంటూ మాత్రం ఎవరూ అడగటం లేదు. అయితే, ఇప్పుడు ఆ డిమాండ్ కూడా బయటకి వచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, విశాఖపట్నం వాస్తవ్యుడు అయిన ఈఏఎస్ శర్మ రుషికొండ కట్టడాలను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కట్టడాలన్నిటినీ కూల్చడమే కరెక్ట్ అని ఆయన అంటున్నారు. 
ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

ఈఏఎస్ శర్మ  లేఖ ఇప్పుడు మాత్రమే రాయలేదు.. గతంలో అంటే, జగన్ ప్రభుత్వం వున్నప్పుడు కూడా ఆయన కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ అసలు గుట్టు రట్టు కావడంతో ఈఏఎస్ శర్మ రాసిన లేఖకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి లీనా నందన్‌కి శర్మ ఈ లేఖ రాశారు. రుషికొండలో వున్న కట్టడాలన్నీ వెంటనే కూల్చేయాలని, రుషికొండలూ సిఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు కట్టరాదని కమిటీ ఇప్పటికే తేల్చిందని, కమిటీ నివేదికను కాదని చేపట్టిన ఈ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రుషికొండ ప్యాలెస్‌ల నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం ఆ నిర్మాణంతో సంబంధం వున్న అధికారుల నుంచి వసూలు చేయాలని సూచించారు. కేరళలో కూడా గతంలో ఇలాంటి నిర్మాణాలే చేసినప్పుడు సుప్రీం కోర్టు కూలగొట్టాలని ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారమే వాటిని కూలగొట్టారని ఈఏఎస్ శర్మ గుర్తుచేస్తున్నారు. 

రుషికొండ కట్టడాలు పర్యావరణానికి తీరని ద్రోహం చేసిన కట్టడాలని, పర్యాటక భవనాల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని శర్మ చెబుతున్నారు. రుషికొండ భవనాలు 500 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టారు కాబట్టి, కూలగొట్టకూడదు అనుకోవడం కరెక్ట్ కాదని, ఈ స్థాయిలో వున్న భవనాలు కూలగొడితే, భవిష్యత్తులో ఇలాంటి సాహసం ఇంకెవ్వరూ చేయరని ఆయన చెబుతున్నారు. పర్యవరణాన్ని పాడుచేసే కట్టడాలు కట్టడానికి పర్యాటకం అనే పేరు చెప్పడం ఫ్యాషన్ అయిందని ఆయన అంటున్నారు. కేంద్రానికి శర్మ రాసిన లేఖలో ఉదహరించిన చట్టాలు, నిబంధనలు చూస్తుంటే కళ్ళు తిరిగేలా వున్నాయి. ఇన్ని చట్టాలు, ఇన్ని నిబంధనలు వున్న ఎంతమాత్రం ఖాతరు చేయకుండా రుషికొండ కట్టడాలు కట్టారన్న విషయం అర్థమవుతోంది. మరి శర్మ రాసిన లేఖ మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.