Publish Date:Sep 26, 2022
అర్ధరాత్రి దాటాకో, తెల్లారిగట్టో ఎవరో వచ్చినట్టయింది.పెద్దావిడ తలుపు తీసింది. వచ్చినవాడి మొహం సరిగా కనపడలేదు. అంతే చేతి కర్రతొ నెత్తిన ఠపీమని ఒక్కటిచ్చుకుంది.. నేనే మామ్మా.. అంటూ మనవడు గుమ్మంలోనే పడిపోయాడు! అయ్యో దొంగనుకున్నార్రా..అంటూ తర్వాత సపరిచర్యలూ చేసింది మనవడికి. ఒక్కోసారి ఇలాంటి సంఘటనలూ జరుగుతూంటాయి. బ్రెజిల్ లోనూ జరిగింది.
జాగింగ్, రన్నింగ్ చేసేవారు వాళ్లు పరిగెత్తాల్సిన ట్రాక్లో వెళ్లకుండా అలా పరిగెడుతూంటారు. రోడ్డు పక్క నే సరదాగా కాలక్షేపం చేస్తూ టిఫిన్ తినడానికి ఈమధ్య అన్ని పట్టణాల్లోనూ ఓపెన్ రెస్టారెంట్లు వచ్చేశాయి. బ్రెజిల్ రెకీఫీ లోని ఒక నగరంలో ఇలాంటిదే ఒకటి ఉంది. ఈమధ్య ఓ సాయింత్రం కొంత మంది అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూన్నారు. అంతలో ఎవరో పరిగెడుతూ రావడం ఓ అమ్మాయి చూసింది. ముందు పెద్దగా పట్టించుకోలేదు. ఎదుటివారితో మాట్లాడుతూనే ఎందుకో భయంతో వెనక్కి తిరిగి చూసింది. అంతే ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి పరుగున వస్తుండడం చూసి భయ పడింది.
ఎవరో దొంగలు పోలీసుల నుంచి తప్పించుకుంటూ పారిపోయి రెస్టారెంట్లోకి వచ్చేస్తున్నారనుకుంది. అంతే వెంటనే పర్సు చేతిలో కి తీసుకుని టిఫిన్, కాఫీలు వదిలేసి రోడ్డుమీదకి పరిగెట్టింది. ఆమె ను చూసి మిగతా అందరూ కూడా పారిపోయాడు. ఆ రెస్టారెంటువాడికి ఏమీ అర్ధంగాక పరుగున లోపల్నించి బయ టికి వచ్చేసరికి ఈ నలుగురు రన్నర్స్ నవ్వుకుంటూ పరిగెడుతూ వెళ్లడం చూశాడు. ఓరి మీ దుంప తెగ మీ రన్నింగ్కి ఈ దారే దొరికిందా.. కొంపలు ముంచేరుకదరా! అని గోల్లుమన్నాడు. పోలీసులకు ఫోన్ చేశాడు. తీరావచ్చి అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే, వారు దొంగలు కాదు రోడ్డుకి అవతలే ఉన్న జిమ్ సభ్యులని తేలింది.
తర్వాత ఏమయిందీ తర్వాత సంగతి. ముందయితే, పాపం ఆ రెస్టారెంట్వాడికి మాత్రం ఆ పూట నష్టమే వచ్చింది. చాలామంది రోజూ వస్తూపోతూంటారు. ఇటాంటి సంఘటన ఒక్కటి చాలు రెస్టా రెంట్ దెబ్బతినడానికి. రేపట్నుంచీ జనం వచ్చినా వెనకా ముందూ చూసుకుంటూ, భయం భయంగానే టీ కాఫీ తాగాలేమో! అన్నట్టు మీ వూళ్లో రన్నర్లు సరిగానే వెళ్లాల్సిన దారిలోనే పరిగెడుతున్నారా?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/runners-mistaken-for-robbers-39-144436.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,