Publish Date:Sep 26, 2022
అర్ధరాత్రి దాటాకో, తెల్లారిగట్టో ఎవరో వచ్చినట్టయింది.పెద్దావిడ తలుపు తీసింది. వచ్చినవాడి మొహం సరిగా కనపడలేదు. అంతే చేతి కర్రతొ నెత్తిన ఠపీమని ఒక్కటిచ్చుకుంది.. నేనే మామ్మా.. అంటూ మనవడు గుమ్మంలోనే పడిపోయాడు! అయ్యో దొంగనుకున్నార్రా..అంటూ తర్వాత సపరిచర్యలూ చేసింది మనవడికి. ఒక్కోసారి ఇలాంటి సంఘటనలూ జరుగుతూంటాయి. బ్రెజిల్ లోనూ జరిగింది.
జాగింగ్, రన్నింగ్ చేసేవారు వాళ్లు పరిగెత్తాల్సిన ట్రాక్లో వెళ్లకుండా అలా పరిగెడుతూంటారు. రోడ్డు పక్క నే సరదాగా కాలక్షేపం చేస్తూ టిఫిన్ తినడానికి ఈమధ్య అన్ని పట్టణాల్లోనూ ఓపెన్ రెస్టారెంట్లు వచ్చేశాయి. బ్రెజిల్ రెకీఫీ లోని ఒక నగరంలో ఇలాంటిదే ఒకటి ఉంది. ఈమధ్య ఓ సాయింత్రం కొంత మంది అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూన్నారు. అంతలో ఎవరో పరిగెడుతూ రావడం ఓ అమ్మాయి చూసింది. ముందు పెద్దగా పట్టించుకోలేదు. ఎదుటివారితో మాట్లాడుతూనే ఎందుకో భయంతో వెనక్కి తిరిగి చూసింది. అంతే ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి పరుగున వస్తుండడం చూసి భయ పడింది.
ఎవరో దొంగలు పోలీసుల నుంచి తప్పించుకుంటూ పారిపోయి రెస్టారెంట్లోకి వచ్చేస్తున్నారనుకుంది. అంతే వెంటనే పర్సు చేతిలో కి తీసుకుని టిఫిన్, కాఫీలు వదిలేసి రోడ్డుమీదకి పరిగెట్టింది. ఆమె ను చూసి మిగతా అందరూ కూడా పారిపోయాడు. ఆ రెస్టారెంటువాడికి ఏమీ అర్ధంగాక పరుగున లోపల్నించి బయ టికి వచ్చేసరికి ఈ నలుగురు రన్నర్స్ నవ్వుకుంటూ పరిగెడుతూ వెళ్లడం చూశాడు. ఓరి మీ దుంప తెగ మీ రన్నింగ్కి ఈ దారే దొరికిందా.. కొంపలు ముంచేరుకదరా! అని గోల్లుమన్నాడు. పోలీసులకు ఫోన్ చేశాడు. తీరావచ్చి అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే, వారు దొంగలు కాదు రోడ్డుకి అవతలే ఉన్న జిమ్ సభ్యులని తేలింది.
తర్వాత ఏమయిందీ తర్వాత సంగతి. ముందయితే, పాపం ఆ రెస్టారెంట్వాడికి మాత్రం ఆ పూట నష్టమే వచ్చింది. చాలామంది రోజూ వస్తూపోతూంటారు. ఇటాంటి సంఘటన ఒక్కటి చాలు రెస్టా రెంట్ దెబ్బతినడానికి. రేపట్నుంచీ జనం వచ్చినా వెనకా ముందూ చూసుకుంటూ, భయం భయంగానే టీ కాఫీ తాగాలేమో! అన్నట్టు మీ వూళ్లో రన్నర్లు సరిగానే వెళ్లాల్సిన దారిలోనే పరిగెడుతున్నారా?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/runners-mistaken-for-robbers-39-144436.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు