రబ్బర్ స్టాంప్ మాట‌కు అర్ధం అప్పుడూ ఇప్పుడూ ఒక్క‌టేనేమో!

Publish Date:Jul 5, 2022

Advertisement

ఒక‌రిని అన్న‌పుడు తామూ ప‌డాలిగ‌దా!  బిజెపికీ ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధా నిగా వున్న‌పుడు ఆయ‌న్ను సోనియా మాట జ‌వ‌దాట‌డ‌ని, కాంగ్రెస్ స్టాంప్ ప్ర‌ధాని అంటూ  తోచిన‌ట్టు కామెంట్లు చేసిన విప‌క్షాల మాట ఇపుడు బిజెపి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ముర్మీ విష‌యంలో విన‌వ‌స్తుంటే ఇబ్బం దిగా మారింది. రాష్ట్ర‌ప‌తి స్థాయిలో వుండేవారు ఏ ప్ర‌భుత్వానికి ప‌క్ష‌పాత ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌రు. కానీ ప్ర‌స్తుతం బిజెపి కోరి వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని చేయాల‌న్న ప‌ట్టుద‌ల వెనుక వారికి అనుకూలించే వ్య‌క్తి ఉన్న‌త ప‌ద‌విలో వుండ‌టం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌నకే బ‌లాన్నిస్తోంది. 

ఒరిస్సాకి చెందిన ముర్మీ ఎంపిక గురించి  విప‌క్షాల త‌ర‌ఫున అధ్య‌క్ష‌ప‌ద‌వి పోటీలో వున్న య‌శ్వంత్ సిన్హా చేసిన ర‌బ్బ‌ర్ స్టాంప్ కామెంట్‌కు బిజెపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఒక ఆదివాసీ మ‌హిళ‌ను ఉన్న‌త స్థానంలోకి తీసుకోవ‌డంలో బిజెపికి మ‌రో ఆలోచ‌న లేద‌ని, సిన్హా చేసిన కామెంట్ విప‌క్షాల మాన‌సిక వైఖ రిని తెలియ‌జేస్తుంద‌ని బిజెపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.టి.ర‌వి వ్యాఖ్యానించారు. కానీ, మోదీ నాయ క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం ఏదీ త‌మ‌కు అన‌నుకూల‌మైన‌దిగా తీసుకోర‌ని అంద‌రికీ తెలిసిన‌దే. ముర్మీ ఎంపిక వెనుక త‌మ పార్టీ, ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిన వ‌ర్గాల ప‌ట్ల ఎంతో గౌర‌వం వుంద‌న్న‌ది ప్ర‌ద‌ర్శించ‌డా నికి త‌ప్ప వాస్త‌వానికి వారు వారి ప్ర‌గ‌తికి చేసిందేమీ లేద‌న్న అభిప్రాయాలు, నినాదాలే దేశ మంతా విన బ‌డుతున్నాయి. వాటిని దాట‌వేయ‌డానికి ఇపుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌నుకున్నారు. 

అందుకే గ‌ట్టి అభ్య‌ర్ధి కోసం వెతికి వేసారే బ‌దులు వెనుక‌బ‌డిన జాతికి చెందిన మ‌హిళ‌ను పోటీకి దింప‌డం స‌మంజ‌స‌మ‌ని బిజెపీ అభిప్రాయ‌ప‌డింది. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. త‌ప్ప‌కుండా తమకు కావ‌ల‌సిన అభ్య‌ర్ధి గెల‌వాలంటే ముర్మీ కంటే త‌గిన అభ్య‌ర్ధి వేరెవ్వ‌రూ వుండ‌ర‌ని బిజెపి వ‌ర్గీయు లు న‌మ్మారు. ఇలాగ‌యితేనే విప‌క్షాల అభ్య‌ర్ధి రాజ‌కీయాల‌ల్లో ఆరితేరిన య‌శ్వం త్ సిన్హాను ఓడించ‌డానికి అవ‌కాశం వుంటుంది. 

ప్ర‌స్తుతం య‌శ్వంత్ బంగ‌ళూరులో ప్ర‌చారంలో వున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో మాట్లాడు తూ బిజెపి ప్ర‌భుత్వం చాలారోజులుగా ఇ.డి, సిబిఐ, ఐటీ శాఖ‌ల‌ను త‌న‌కు అనుకూలించే విధంగా ఉప యోగిస్తూన్న‌ద‌ని విమ‌ర్శించారు. త‌మ విరోధుల ఆట‌క‌ట్టించేందుకు బిజెపి ప్ర‌భుత్వం ఎప్పుడూ ఈ స్వ‌తంత్ర సంస్థ‌లను అస్త్రాలుగా వాడుతోంద‌న్నారు. కేంద్రం మాట, ఆదేశానుసార‌మే ఆ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. అందుకు వుదాహ‌ర‌ణే బిజెపీయేత‌ర పార్టీ నాయ‌కుల ఆస్తులు, నివాసాల‌పై ఇ.డి, ఐ.టీ దాడులు మితిమీరి జ‌ర‌గ‌డం. ఈ సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ అర్ధ‌మ‌యింది. భ‌విష్య‌త్తులో రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల్లో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికే బిజెపి వ‌ర్గం ముర్మీని  రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌గిన అభ్య ర్ధిగా ప్ర‌చారం చేస్తోంది.  ఇది మోదీ రాజ‌కీయ‌చ‌తుర‌త తెలిసిన అంద‌రి మాట‌. 

మోదీ టీమ్ మ‌ళ్లీ ఒక్క‌టి గుర్తుంచుకోవాలి.  గ‌తంలో చేసిన కామెంట్లు త‌మ‌వారి విష‌యంలోనూ విన‌వ‌స్తుం టాయ‌న్న‌ది. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌హ‌యాంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ను విప‌క్షంలో వుండ‌గా ర‌బ్బ‌రు స్టాంప్ ప్ర‌ధాని అంటూ అప‌హాస్యం చేసిన‌వారు దాన్ని అంత సుల‌భంగా మ‌ర్చిపోవ‌డం త‌గ‌దు. ముర్మి విష‌యంలో మోదీ ఎంతో అద్భుతంగా ప్ర‌చారం చేసుకున్న‌పుడు ఆమె రాష్ట్ర‌ప‌తిగా బిజెపీ ప్ర‌భుత్వానికి ర‌బ్బ‌రుస్టాంప్ రాష్ట్ర‌ప‌తిగా మార‌వ‌చ్చ‌న్న కామెంటు నీ అంతే  సుల‌భంగా తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్ర‌భ‌త్వం అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ త‌మ‌కు అనుకూలించే విధంగా ప‌నిచేసేలా మార్చేశాయి గ‌నుక‌. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌యంలో బిజెపి ఎంపిక చేసుకున్న ముర్మీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన వ్యక్తే కావ‌చ్చ‌, గ‌తం లో  ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గిరీ చేప‌ట్టి వుండ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత‌ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆమెను రాష్ట్ర ప‌తి అభ్య‌ర్ధిగా తీసుకురావ‌డంలో అంత‌రార్ధం త‌మ‌కు భ‌విష్య‌త్తులో రాజ్యాంగ‌బ‌ద్ధ‌, చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌వ‌హారాల్లో ఎలాంటి అడ్డంకులైనా తొల‌గించుకోను వీలుండేందుకు అనే భావ‌నా ప్ర‌క‌టిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో నే బ‌హుశా య‌శ్వంత్ సిన్హా  ఆమెను బిజెపి వారి ర‌బ్బ‌రు స్టాంప్ అని కామెంట్ చేసి వుండ‌వ‌చ్చు.  మ‌రి బిజెపీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం కూడా రిటార్ట్‌ను అంగీక‌రించాల్సిందేగా!

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.