రబ్బర్ స్టాంప్ మాట‌కు అర్ధం అప్పుడూ ఇప్పుడూ ఒక్క‌టేనేమో!

Publish Date:Jul 5, 2022

Advertisement

ఒక‌రిని అన్న‌పుడు తామూ ప‌డాలిగ‌దా!  బిజెపికీ ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధా నిగా వున్న‌పుడు ఆయ‌న్ను సోనియా మాట జ‌వ‌దాట‌డ‌ని, కాంగ్రెస్ స్టాంప్ ప్ర‌ధాని అంటూ  తోచిన‌ట్టు కామెంట్లు చేసిన విప‌క్షాల మాట ఇపుడు బిజెపి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ముర్మీ విష‌యంలో విన‌వ‌స్తుంటే ఇబ్బం దిగా మారింది. రాష్ట్ర‌ప‌తి స్థాయిలో వుండేవారు ఏ ప్ర‌భుత్వానికి ప‌క్ష‌పాత ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌రు. కానీ ప్ర‌స్తుతం బిజెపి కోరి వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని చేయాల‌న్న ప‌ట్టుద‌ల వెనుక వారికి అనుకూలించే వ్య‌క్తి ఉన్న‌త ప‌ద‌విలో వుండ‌టం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌నకే బ‌లాన్నిస్తోంది. 

ఒరిస్సాకి చెందిన ముర్మీ ఎంపిక గురించి  విప‌క్షాల త‌ర‌ఫున అధ్య‌క్ష‌ప‌ద‌వి పోటీలో వున్న య‌శ్వంత్ సిన్హా చేసిన ర‌బ్బ‌ర్ స్టాంప్ కామెంట్‌కు బిజెపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఒక ఆదివాసీ మ‌హిళ‌ను ఉన్న‌త స్థానంలోకి తీసుకోవ‌డంలో బిజెపికి మ‌రో ఆలోచ‌న లేద‌ని, సిన్హా చేసిన కామెంట్ విప‌క్షాల మాన‌సిక వైఖ రిని తెలియ‌జేస్తుంద‌ని బిజెపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.టి.ర‌వి వ్యాఖ్యానించారు. కానీ, మోదీ నాయ క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం ఏదీ త‌మ‌కు అన‌నుకూల‌మైన‌దిగా తీసుకోర‌ని అంద‌రికీ తెలిసిన‌దే. ముర్మీ ఎంపిక వెనుక త‌మ పార్టీ, ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిన వ‌ర్గాల ప‌ట్ల ఎంతో గౌర‌వం వుంద‌న్న‌ది ప్ర‌ద‌ర్శించ‌డా నికి త‌ప్ప వాస్త‌వానికి వారు వారి ప్ర‌గ‌తికి చేసిందేమీ లేద‌న్న అభిప్రాయాలు, నినాదాలే దేశ మంతా విన బ‌డుతున్నాయి. వాటిని దాట‌వేయ‌డానికి ఇపుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌నుకున్నారు. 

అందుకే గ‌ట్టి అభ్య‌ర్ధి కోసం వెతికి వేసారే బ‌దులు వెనుక‌బ‌డిన జాతికి చెందిన మ‌హిళ‌ను పోటీకి దింప‌డం స‌మంజ‌స‌మ‌ని బిజెపీ అభిప్రాయ‌ప‌డింది. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. త‌ప్ప‌కుండా తమకు కావ‌ల‌సిన అభ్య‌ర్ధి గెల‌వాలంటే ముర్మీ కంటే త‌గిన అభ్య‌ర్ధి వేరెవ్వ‌రూ వుండ‌ర‌ని బిజెపి వ‌ర్గీయు లు న‌మ్మారు. ఇలాగ‌యితేనే విప‌క్షాల అభ్య‌ర్ధి రాజ‌కీయాల‌ల్లో ఆరితేరిన య‌శ్వం త్ సిన్హాను ఓడించ‌డానికి అవ‌కాశం వుంటుంది. 

ప్ర‌స్తుతం య‌శ్వంత్ బంగ‌ళూరులో ప్ర‌చారంలో వున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో మాట్లాడు తూ బిజెపి ప్ర‌భుత్వం చాలారోజులుగా ఇ.డి, సిబిఐ, ఐటీ శాఖ‌ల‌ను త‌న‌కు అనుకూలించే విధంగా ఉప యోగిస్తూన్న‌ద‌ని విమ‌ర్శించారు. త‌మ విరోధుల ఆట‌క‌ట్టించేందుకు బిజెపి ప్ర‌భుత్వం ఎప్పుడూ ఈ స్వ‌తంత్ర సంస్థ‌లను అస్త్రాలుగా వాడుతోంద‌న్నారు. కేంద్రం మాట, ఆదేశానుసార‌మే ఆ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. అందుకు వుదాహ‌ర‌ణే బిజెపీయేత‌ర పార్టీ నాయ‌కుల ఆస్తులు, నివాసాల‌పై ఇ.డి, ఐ.టీ దాడులు మితిమీరి జ‌ర‌గ‌డం. ఈ సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ అర్ధ‌మ‌యింది. భ‌విష్య‌త్తులో రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల్లో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికే బిజెపి వ‌ర్గం ముర్మీని  రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌గిన అభ్య ర్ధిగా ప్ర‌చారం చేస్తోంది.  ఇది మోదీ రాజ‌కీయ‌చ‌తుర‌త తెలిసిన అంద‌రి మాట‌. 

మోదీ టీమ్ మ‌ళ్లీ ఒక్క‌టి గుర్తుంచుకోవాలి.  గ‌తంలో చేసిన కామెంట్లు త‌మ‌వారి విష‌యంలోనూ విన‌వ‌స్తుం టాయ‌న్న‌ది. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌హ‌యాంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ను విప‌క్షంలో వుండ‌గా ర‌బ్బ‌రు స్టాంప్ ప్ర‌ధాని అంటూ అప‌హాస్యం చేసిన‌వారు దాన్ని అంత సుల‌భంగా మ‌ర్చిపోవ‌డం త‌గ‌దు. ముర్మి విష‌యంలో మోదీ ఎంతో అద్భుతంగా ప్ర‌చారం చేసుకున్న‌పుడు ఆమె రాష్ట్ర‌ప‌తిగా బిజెపీ ప్ర‌భుత్వానికి ర‌బ్బ‌రుస్టాంప్ రాష్ట్ర‌ప‌తిగా మార‌వ‌చ్చ‌న్న కామెంటు నీ అంతే  సుల‌భంగా తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్ర‌భ‌త్వం అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ త‌మ‌కు అనుకూలించే విధంగా ప‌నిచేసేలా మార్చేశాయి గ‌నుక‌. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌యంలో బిజెపి ఎంపిక చేసుకున్న ముర్మీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన వ్యక్తే కావ‌చ్చ‌, గ‌తం లో  ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గిరీ చేప‌ట్టి వుండ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత‌ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆమెను రాష్ట్ర ప‌తి అభ్య‌ర్ధిగా తీసుకురావ‌డంలో అంత‌రార్ధం త‌మ‌కు భ‌విష్య‌త్తులో రాజ్యాంగ‌బ‌ద్ధ‌, చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌వ‌హారాల్లో ఎలాంటి అడ్డంకులైనా తొల‌గించుకోను వీలుండేందుకు అనే భావ‌నా ప్ర‌క‌టిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో నే బ‌హుశా య‌శ్వంత్ సిన్హా  ఆమెను బిజెపి వారి ర‌బ్బ‌రు స్టాంప్ అని కామెంట్ చేసి వుండ‌వ‌చ్చు.  మ‌రి బిజెపీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం కూడా రిటార్ట్‌ను అంగీక‌రించాల్సిందేగా!

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.