ఆమెకి పెద్దల టికెట్!.. జగన్ బిగ్ స్కెచ్!

Publish Date:Apr 29, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్’ లో ఒకేసారి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర శాసన సభలో ఉన్నసంఖ్యాబలం కారణంగా ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదలా ఉంటే,ఈ నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఒక సీటు, బిజినెస్ కోటాలో, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీకి రిజర్వు అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పెద్దలతో చర్చింఛి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే బిజినెస్ కోటాలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి సన్నిహితుడు, రిలయన్స్‌ సంస్థల వైస్‌ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు అదే విధంగా మరో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీని రాజ్య సభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. 

అదలా ఉంటే, వైసీపీపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్‌ మొదటివారంలో ముగుస్తోంది.ఆయనకు రెండోసారి కూడా అవకాశమిచ్చేందుకు జగన్ రెడ్డి సుముఖంగా లేరని సమాచారం. అయితే, మాయల పకీరు ప్రాణం చెట్టు తొర్రలో ఉన్నట్లు, జగన్ రెడ్డి గుట్టుమట్లన్నీ  విజయసాయి గుప్పిట్లో ఉన్నాయని, అందువలన చేత పార్టీ పునర్వ్యవస్తీకరణలో ప్రయోగించిన, ‘బ్లాక్ మెయిల్’ అస్త్రాన్ని విజయ సాయి మళ్ళీ  ప్రయోగిస్తే ముఖ్యమంత్రి ఏమి చేస్తారనేది అనుమానమే అంటున్నారు. 

విజయసాయి వ్యవహారం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరినీ పెద్దల సభకు పంపాలనే నిర్ణయానికి వచ్చారని, పార్టీ వర్గాల సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బీర మస్తాన్ రావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలొ ఒకరికి  రాజ్య సభ టికెట్ ఖాయమని అంటున్నారు. అలాగే, ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించి, విమర్శలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్’కు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని,అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి తెలుగు దేశం పార్టీనుంచి వచ్చిన విడదల రజనీని చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించిన సమయంలోనే, రాజశేఖర్’ కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ప్రామిస్ చేశారు. అయితే, ఆతర్వాత అలవాటులో పొరపాటుగా, మాట తప్పారు. మడమ తిప్పారు. ఇప్పుడు, రాజకీయ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే అలోచన చేస్తున్నారని అంటున్నారు. 
 
మరోవంక వైసీపీలో సహజంగానే, పైసా ఖర్చు లేకుద్న పెద్దల సభకు వెళ్ళే అద్భుత అవకాశం కోసం సజ్జల సహా చాలా  మందేపోటీ పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇంకా మరి కొందరు కూడా రేసులో ఉన్నారని అంటున్నారు.అదే సమయంలో, ఎవరూ ఉహించని పేర్లు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని, అంటున్నారు.
 

By
en-us Political News

  
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.