Publish Date:Aug 18, 2022
తిరుమలేశుని దర్శనానికి ఏడాది కాలం నుంచే ఎంతో సిద్ధపడి వెళుతూంటారు జనం. తిరుమల రద్దీకి, కాలానికి సంబంధం లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. గంటలతరబడీ దర్శనానికి భక్తకోటి వేచి ఉం టారు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. కానీ అధికార పార్టీవారికి అలాంటివేమీ పట్టింపులేదు. ఏపీలో వైసీపీ మంత్రులు, ఎమెల్యేలు ప్రొటోకాల్ పాటించడం సహజం. కానీ పర్యాటకశాఖా మంత్రి ఆర్.కె. రోజా మాత్రం తనకు, తన అనుచురులకీ పెద్దగా ప్రోటోకాల్తో పనిలేదనే భావించారు. ఇదే భక్తజన కోటికి ఆగ్రహమూ తప్పించెను.
గంటలతరబడి వేచి ఉన్న భక్తులను కాకుండా తనకు, తనతో వచ్చిన 30 మంది అనుచరులకు మంత్రి వారందిరికీ దర్శనం వెంటనే ఇప్పించాలని భీష్మించారు. దీనికి ప్రభుత్వం తరఫున పాటించాల్సిన కనీస ప్రోటోకాల్ పద్ధతిని కూడా ఉల్లంఘించడం గమనార్హం. అప్పటికే అధికారులు, అక్కడి ఇతర పని వారూ ఆమె రాకతో భక్తుల ఇబ్బందుల గురించి వివరించారు. కానీ తాను పర్యాటకశాఖ మంత్రిని కనుక తనకు నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వామి దర్శనం కల్పించాల్సిన బాద్యత అక్కడున్న అధి కారులదే అన్నంతగా భీష్మించారు ఆర్.కె.రోజా. వాస్తవానికి ఆగష్టు 21 వరకూ టిటిడి బ్రేక్ దర్శనాలు నిలిపి వేసింది.
కానీ అధికారంలో ఉన్నవారికి అందునా పర్యాటకశాఖ మంత్రికి టీటీడీ నియమనిబంధనలు తెలియక పోవు. అయినా రోజా తన అనుచరులతో బ్రేక్ దర్శనం కోసం డిమాండ్ చేయడం ఎంతవరకూ సమం జసం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వేలాదిమంది భక్తులను కాదని తన 30మంది అనుచరులకు దర్శ నం కల్పించడానికి పట్టుబట్టడం ఆమె అధికార బలప్రదర్శనకు నిదర్శనమే అవుతుంది. ఇది ఊహిం చని సంఘటనే. ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఉండాలనే అధికారులు ప్రార్ధనలు చేయాలి. కనీసం ప్రోటోకాల్ లేకుండా మంత్రిగా తన సత్తాను అనుచరగణం ముందు ప్రదర్శించడంలో అర్ధం లేదు. అధికారుల ని వత్తిడి చేసి మరో పదిమందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. దర్శనాలు పూర్త య్యకనే బయటకి వచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-no-protocol-39-142178.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.