Publish Date:Apr 20, 2024
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి, ఏదో ఒక సంబంధం లేని దిక్కుమాలిన కేసు పెట్టించి సంస్థ అధినేత రామోజీరావు తదితరుల మీద విచారణ ప్రారంభించారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న రామోజీరావును వేధించారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో జగన్ అండ్ కో శాంతించక తప్పలేదు. ఆవు చేలో మేస్తే దూడ మాత్రం గట్టున మేస్తుందా అన్నట్టు.. జగన్ ఆశయాలకు అనుగుణంగా అప్పట్లో వైసీపీ నాయకులు రామోజీరావు మీద, మార్గదర్శి సంస్థ మీద నిప్పులు చెరిగారు.
‘‘నేనూ మార్గదర్శలో చేరాను.. ఒక మోపెడ్ కొనుక్కున్నాను’ అనే యాడ్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు లేటెస్ట్.గా ఆ ప్రకటన షూట్ చేయాలంటే రోజాని మించిన యాక్టర్ మరొకరు వుండరు. ఎందుకంటే, రోజా కూడా మార్గదర్శిలో చేరారు. శుక్రవారం నాడు కదిరి స్థానానికి నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో చెప్పుకోవల్సింది ఏంటంటే, రోజా మార్గదర్శి చిట్ఫండ్ సంస్థలో సభ్యురాలు. 2020లో ఆమె 40 లక్షల రూపాయల చిట్లో చేరారు. 2020 ప్రాంతం అంటే, వైసీపీ నాయకులు మార్గదర్శి మీద పగబట్టి వేధింపులు జరుపుతున్న సమయం. ఒకవైపు జగనన్న మార్గదర్శి మోసకారి సంస్థ అని శాయశక్తులా దుష్ప్రచారం చేస్తుంటే, జగనన్న బాటలో నడిచే రోజా మాత్రం మార్గదర్శి చిట్ఫండ్లో చేరడం మాత్రం నిజంగానే ఒక వింత. మరి రోజా మార్గదర్శిలో చేరారన్న విషయం తెలిస్తే జగనన్న ఎలా ఫీలవుతారో ఏంటో. రోజా మార్గదర్శిలో చేరిన అంశాన్ని రాజకీయాలు రాజకీయాలే, వ్యక్తిగతం వ్యక్తిగతమే అన్నట్టుగా చూడాలా.. లేక.. అవసరమైతే కస్టమర్ హోదాలో మార్గదర్శి మీద విరుచుకుపడటానికి అలా గ్రౌండ్ ప్రిపరేషన్ ఏమైనా చేసి వుంటారా అన్నట్టు చూడాలా?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-in-margadarsi-39-174207.html
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.