Publish Date:Apr 20, 2024
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి, ఏదో ఒక సంబంధం లేని దిక్కుమాలిన కేసు పెట్టించి సంస్థ అధినేత రామోజీరావు తదితరుల మీద విచారణ ప్రారంభించారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న రామోజీరావును వేధించారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో జగన్ అండ్ కో శాంతించక తప్పలేదు. ఆవు చేలో మేస్తే దూడ మాత్రం గట్టున మేస్తుందా అన్నట్టు.. జగన్ ఆశయాలకు అనుగుణంగా అప్పట్లో వైసీపీ నాయకులు రామోజీరావు మీద, మార్గదర్శి సంస్థ మీద నిప్పులు చెరిగారు.
‘‘నేనూ మార్గదర్శలో చేరాను.. ఒక మోపెడ్ కొనుక్కున్నాను’ అనే యాడ్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు లేటెస్ట్.గా ఆ ప్రకటన షూట్ చేయాలంటే రోజాని మించిన యాక్టర్ మరొకరు వుండరు. ఎందుకంటే, రోజా కూడా మార్గదర్శిలో చేరారు. శుక్రవారం నాడు కదిరి స్థానానికి నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో చెప్పుకోవల్సింది ఏంటంటే, రోజా మార్గదర్శి చిట్ఫండ్ సంస్థలో సభ్యురాలు. 2020లో ఆమె 40 లక్షల రూపాయల చిట్లో చేరారు. 2020 ప్రాంతం అంటే, వైసీపీ నాయకులు మార్గదర్శి మీద పగబట్టి వేధింపులు జరుపుతున్న సమయం. ఒకవైపు జగనన్న మార్గదర్శి మోసకారి సంస్థ అని శాయశక్తులా దుష్ప్రచారం చేస్తుంటే, జగనన్న బాటలో నడిచే రోజా మాత్రం మార్గదర్శి చిట్ఫండ్లో చేరడం మాత్రం నిజంగానే ఒక వింత. మరి రోజా మార్గదర్శిలో చేరారన్న విషయం తెలిస్తే జగనన్న ఎలా ఫీలవుతారో ఏంటో. రోజా మార్గదర్శిలో చేరిన అంశాన్ని రాజకీయాలు రాజకీయాలే, వ్యక్తిగతం వ్యక్తిగతమే అన్నట్టుగా చూడాలా.. లేక.. అవసరమైతే కస్టమర్ హోదాలో మార్గదర్శి మీద విరుచుకుపడటానికి అలా గ్రౌండ్ ప్రిపరేషన్ ఏమైనా చేసి వుంటారా అన్నట్టు చూడాలా?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-in-margadarsi-39-174207.html
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.