Publish Date:Apr 16, 2022
వాళ్లు చాలా రిచ్. లెక్కలేనంత సంపద. ఇంట్లో కబోర్డ్స్ లోనే భారీగా బంగారు వజ్రాభరణాలు. మా ఇంట్లోకి ఎవరు వస్తారులే అనే ధీమా. ఆ నగలను పసిగట్టింది ఆ ఇంటికొచ్చిన నర్సు. విషయం మొగుడికి చెప్పింది. ఆ కిలాడీ కపుల్స్.. ఇంటి యజమానికి రోజూ నిద్ర మాత్రలు ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక.. రోజుకో నగ దొంగిలిస్తూ వచ్చారు. ఒకేసారి అంతా దోచేస్తే డౌట్ వస్తుందని.. అలా ఒక్కోటీ ఎత్తుకెళ్లారు. ఆ ఖరీదైన నగలను అమ్మేసి.. అప్పులు తీర్చేసి.. కారు కూడా కొనుక్కున్నారు. కట్ చేస్తే.. ఆ దొంగ కపుల్స్ పోలీస్ స్టేషన్లో నిజమంతా కక్కేశారు.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజాది సంపన్న కుటుంబం. వాళ్లు ఉండేది ముంబైలోనే అయినా.. వారికి ఢిల్లీలో ఖరీదైన భవనం ఉంది. అందులో ఆనంద్ అహుజా తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంట్లో 2 కోట్ల విలువైన ఆభరణాల చోరీ జరగడం కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో ఆ దొంగలెవరో బయటపడ్డారు. ఆ ఇంట్లో పని చేస్తున్న నర్సు, ఆమె భర్తే ఈ దొంగతనానికి తెగించారని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని దొంగతనం వివరాలు రాబట్టారు. ఆ ఖరీదైన దొంగతనం ఎలా జరిగిందంటే....
ఢిల్లీలోని అమృతా షెర్లింగ్ మార్గ్లో ఉన్న భవంతిలో ఉంటున్న సోనమ్కపూర్ అత్త ప్రియకు కేర్ టేకర్గా ఉండేందుకు అపర్ణ రీతూ వెల్సన్ అనే నర్సును నియమించారు. అయితే, ప్రియ బెడ్రూమ్ కబోర్డ్స్లో ఉన్న బంగారం, వజ్రాభరణాలు, డబ్బు.. నర్సు అపర్ణ కంటపడ్డాయి. ఈ విషయం భర్త నరేశ్ కుమార్కు చెప్పింది. ఆ సొమ్మంతా అపహరిస్తే.. తమకున్న అప్పులు తీరిపోతాయని భావించారు. నరేశ్ పథకం మేరకు.. ప్రియకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలిచ్చి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని అపర్ణ అపహరించేది. అలా, దొంగిలించిన బంగారం, వజ్రాభరణాలను నరేశ్ అమ్మేసి నగదుగా మార్చేవాడు. ఇలా, ఆ జంట కొన్ని నెలలపాటు దొంగతనానికి పాల్పడి.. వచ్చిన డబ్బుతో తమకున్న అప్పులన్నీ తీర్చేసింది. మిగిలిన మనీతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే, ఇంట్లో పని చేసే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలంటున్నారు. వివరాలు తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోవద్దని.. అది నర్సు అయినా, పనోళ్లైనా బ్యాక్గ్రౌండ్ చెక్ కంపల్సరీ అంటున్నారు పోలీసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/robbery-details-in-sonam-kapoor-delhi-house-39-134514.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.