అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు సొంత దేశంలోనే చుక్కెదురైంది. ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది. డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని పాతిక రాష్ట్రాల కూటమి ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన అధికార పరిమితులను దాటి వ్యవహరిస్తోందంటూ.. అమెరికా కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్' లో పిటిషన్ను దాఖలు చేశాయి. అధ్యక్షుడు తన పరిధికి మించి తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల స్వదేశీ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర విఘాతం కలుగుతుందని రాష్ట్రాలు పిటిషన్ లో పేర్కొన్నాయి.
ట్రంప్ సర్కార్ భారత్ సహా దాదాపు 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను మోపింది. భారత్పై ప్రారంభంలో ఏకంగా 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఆ పన్నును 10 శాతానికి తగ్గించింది. అయితే చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులతో పాటు యుఎస్, మెక్సికో, కెనడా ఉమ్మడి వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే సరుకులకు మాత్రం ఈ నూతన పన్నుల నుండి ప్రత్యేక మినహాయింపుని ఇచ్చింది.
అయితే.. ఈ టారిఫ్ ల వల్ల స్థానిక వ్యాపారాలు, సామాన్య వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని 25 రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీ పన్నులు వేయడం వల్ల అంతిమంగా ఆ భారం అమెరికా పౌరుల జేబులపైనే పడుతుందని, నిత్యావసర ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికా వినియోగదారులపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని, వ్యాపార సంస్థల సరఫరా వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికా రాలను దాటి వ్యాపార రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని డెమోక్రటిక్ రాష్ట్రాలు తమ పిటిషన్ లో పేర్కొన్నాయి.
Trump new tariffs, 25 US states oppose Trump, US Court of International Trade, Telugu One
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revolt-in-america-against-trump-tariffs-36-227943.html
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్పిఎస్, ఇన్స్పిరాన్, ఏలియన్వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్ను, 70% మంది ఆన్లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న కొత్త ఎఫ్డీ నిబంధనలు, వడ్డీ రేట్ల పారదర్శకత పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేసేలా పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన. కొత్త కార్లు, బైకుల బీమా గడువు పెంపుపై సమగ్ర కథనం.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.