Publish Date:Oct 18, 2024
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి సొంత పార్టీలోనే తలనొప్పులు ఉన్నాయా? ఆయన వల్ల పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనం లేదనీ, పైపెచ్చు పార్టీకి ఆయన తీరని నష్టం చేస్తున్నారంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోల సృష్టికర్తలు బీజేపీ వారేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కిషన్ రెడ్డి నిష్క్రియాపరత్వంపై, అలాగే ఇతర పార్టీలకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో చాలా కాలంగా అసంతృప్తి ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే గత ఎన్నికల ముందు అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సమయంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచీ కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా సొంత పార్టీలోనే కిషన్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తి ఎటువంటి దాపరికం లేకుండా వ్యక్తం అవుతూనే వస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల వెనుక ఉన్నది సొంత పార్టీ నేతలేనని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ఇలా ఉండగా పార్టీ ప్రతిష్ట, కిషన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిషన్ రెడ్డి పార్టీలో ఎవరికి ఉపయోగపడడు... సొంత పార్టీ నేతల ఓటమి గురించి పని చేస్తాడని.. తన సొంత లోక్ సభ నియోజక వర్గంలో ఒక్క ఎమ్మెల్యేను గెలుపించుకొని అసమర్థ నాయకుడు.. పక్క పార్టీ నేతల గెలుపు కోసం కృషి చేస్తాడంటూ అగంతకులు వీడియోలు తాయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.బీజేపీ ప్రతిష్ఠ, కిషన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉండటంతో.. బీజేపీ నేతలు సైబర్ క్రైమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revolt-against-kishanreddy-39-187010.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది