దూకుడు పెంచిన రేవంత్‌.. 26 నుంచి స‌రికొత్త పాల‌న!

Publish Date:Jan 5, 2025

Advertisement

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల‌న‌లో మ‌రింత దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఈనెల 26వ తేదీ నుంచి స‌రికొత్త పాల‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో తాను అనుకున్న విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ‌చ్చిన రేవంత్ అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీల‌పై ఎదురు దాడినీ కొన‌సాగించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేస్తూ   సాగుతున్నారు. అయితే  ఈ ఏడాది కాలంలో రేవంత్ స‌ర్కార్ పాల‌న‌కు అత్తెస‌రు మార్కులే వ‌చ్చాయి. హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ కొంత‌ మేర విఫ‌ల‌మైంద‌న్న వాద‌న తెలంగాణ సమాజంలో బలంగా  వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా రైతుల‌కు మేలుచేసే విష‌యంలో ఏడాది కాలంలో ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో విజ‌యవంతం కాలేద‌న్న అభిప్రాయం ఉంది. రెండు ల‌క్ష‌ల బ్యాంకు రుణాల‌ను మాఫీ చేసిన‌ప్ప‌టి.. రైతులందరికీ రుణ‌మాపీ అంద‌లేదు. దీంతో రుణ‌మాఫీ కాని రైతులు రేవంత్ స‌ర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ప్ర‌భుత్వం మాత్రం అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని చెబుతోంది.  అయితే, ఏడాది కాలంలో వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుకుంటూ స‌రికొత్త పాల‌నకు శ్రీ‌కారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం జ‌న‌వ‌రి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.  

జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ‌డిచిన ఏడాదిలో పాల‌నాప‌రంగా, రాజ‌కీయంగా జ‌రిగిన లోటుపాట్ల‌ను గ్ర‌హించి వాటిపై ప‌ట్టు సాధించేందుకు  రేవంత్‌ ఫోక‌స్ పెట్టారు. అందు కోసం నేరుగా జిల్లాల్లోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 24 వ‌ర‌కు రేవంత్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన త‌రువాత 26వ తేదీన రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొని.. అదే రోజు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రేవంత్ శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా ప‌థ‌కంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ప‌థ‌కంతో పాటు మ‌రికొన్ని ప‌థ‌కాల‌కు జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచే రేవంత్ స‌ర్కార్ శ్రీ‌కారం చుట్ట‌నుంది. అంత‌కు ముందు 16వ తేదీ నుంచే మంత్రులు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ ప్రారంభించ‌బోయే ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌నున్నారు. 

కేబినెట్ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం అమ‌లుకు నిర్ణ‌యించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై స్వ‌యంగా రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతు బంధు ప‌థ‌కం కింద రెండు ద‌ఫాలుగా ఎక‌రానికి రూ.10వేలు అందించింది. అయితే, ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఎక‌రాకు రెండు ద‌ఫాలుగా రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి రైతు భ‌రోసాగా నామ‌క‌రం చేసిన విష‌యం తెలిసిందే. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో రైతుల‌కు ఎన్ని ఎక‌రాలు ఉన్నా ప‌రిమితి లేకుండా రైతు బంధు ప‌థ‌కం అమ‌లైంది. ఆ క్ర‌మంలో వ్య‌వ‌సాయం యోగ్యం కాని భూములు, రాళ్లుర‌ప్ప‌లు, మైనింగ్ కోసం కేటాయించిన భూములు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసిన భూముల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌కు సైతం రైతు బంధు నిధులు ప‌డ్డాయి. దీంతో ప్ర‌జాధ‌నం భారీగా వృథా అయ్యిందని గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లు విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేవ‌లం వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూముల‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా సాయం అందిస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప‌ల్లెల్లో ఉంటూ భూమి లేని వ్య‌వ‌సాయ రైతు కుటుంబాల‌కు కూడా ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాగా పేరును ఖ‌రారు చేశారు. రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌ వుతు న్నాయి. అస‌లైన రైతుల‌కు, భూమిలేని కుటుంబాల‌కు మేలు జ‌రిగేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉంద‌ని పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కొత్త రేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కొత్త‌కార్డులు రాలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్  హ‌యాంలో అర్హులైన వారంద‌రికీ కొత్త రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాల‌ను జ‌న‌వ‌రి 26వ తేదీనే శ్రీ‌కారం చుట్టాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ స‌రికొత్త పాల‌న ప్రారంభ‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఏడాది పాల‌న‌లో లోటుపాట్ల‌ను స‌రిచేసుకుంటూ రాబోయే కాలంలో మ‌రింత మెరుగైన పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జానీకానికి అందించేందుకు రేవంత్ స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతున్నది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.