రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అరెస్ట్ పై ఆయన భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి అరెస్ట్పై కొడంగల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గీత ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి మూడు గంటలకు తమ ఇంట్లోని బెడ్రూమ్లోకి చొరబడి పోలీసులు దాడులు చేయడాన్ని, రేవంత్ను అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ రిటర్నింగ్ అధికారికి లేఖ సమర్పించారు. కుటుంబసభ్యులతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని లేఖలో ప్రస్తావించారు. తన భర్తను ఏ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు?...ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలి అంటూ లేఖలో డిమాండ్ చేశారు. ఇన్ని గంటలైనా ఇప్పటి వరకు పోలీసులు సమాధానం చెప్పలేదని గీత ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి ఫాంహౌజ్లో గత నెల 27న అధికారులు దాడి చేసినప్పుడు భారీగా నగదు లభ్యమైనా అతని అభ్యర్థిత్వంపై చర్యలు తీసుకోకపోవడాన్ని రేవంత్ ప్రశ్నిస్తే, ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. అధికార యంత్రాంగం చర్యలను నిరసిస్తూ శాంతియుత నిరసనకు రేవంత్ పిలుపునిస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటి అని లేఖలో ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?..ప్రశ్నించే హక్కు లేదా? అని రిటర్నింగ్ అధికారిని గీత ప్రశ్నించారు. పోలీసులు తమ ఇంటి బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించడం ఎంత వరకు సబబు అంటూ ఓ మహిళగా ఆలోచించాలి అని అధికారినికి విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగానే తాము ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్ట్పై ఆయన కూతురు నైమిషా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రిని ఎక్కడ ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి తమ ఇంటి తలుపులను బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి వచ్చి తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. ఒక టెర్రరిస్టును ఈడ్చుకెళ్లినట్లు తన తండ్రిని పోలీసులు తీసుకువెళ్లారని అన్నారు. తన తండ్రితో పాటు ఆయన సోదరులు, అనచురులు, ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తన తండ్రిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన వారు పోలీసులేనా అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లారో ప్రశ్నించే హక్కు తమకు ఉందని, తన తండ్రి ఎక్కడ ఉన్నారో చెప్పాలని నైమిషా రెడ్డి డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-wife-geetha-complaint-to-election-returning-officer-over-revanth-arrest-39-84709.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.