పార్టీ మారిన తరువాత ముందు బాగానే ఉంటుంది. ఆ తరువాతే అసలు సమస్య అంతా. కనీసం పేరు కూడా ఎక్కడా వినిపించదు. అది ఎర్రబెల్లి విషయంలోనే అర్ధమయి ఉండాలి రేవంత్ రెడ్డికి. ఎర్రబెల్లి ఆవేశంగా టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు కనీసం ఎర్రబెల్లి పేరు కూడా ఎక్కడా వినిపించడంలేదు. కనీసం టీడీపీలో ఉంటే అయినా.. సీనియర్ నేతగా ఏదో ఒక పదవిలో ఉండేవాడు. ఇవన్నీ తెలిసీ కూడా రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం తన మాట మీదే నిలబడుతుందని... తాను ఏది చెబితే నాయకులు గొర్రెల్లా తల ఊపుతారని..పార్టీ మొత్తం తనదే అన్నట్టు తెగ ఎగరిపడ్డాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా రేవంత్ గాలి తీసేశాడు జానారెడ్డి. ముందు రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీ ఫేట్ మారిపోతుందని.. కాంగ్రెస్ పార్టీలోకి బాహుబలి వస్తాడని అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి వెళ్లిన తరువాత మాట తీరు మారిపోయింది. బాహుబలులు ఇప్పటికే వచ్చారని…. ఇంకా వస్తారని చెప్పుకొచ్చారు. సినిమాలో వచ్చే బాహుబలి కాదు…ఇంకెంత మంది బాహుబలులు వస్తారో మీరే చూస్తారని జానారెడ్డి అన్నాడు. అంటే రేవంత్ ఏదో పెద్ద తోపు అన్నట్లుగా కాదని తేల్చిపారేశారు. పాపం ఇవన్నీ ఏం తెలయని రేవంత్ తానేదో నిజంగానే తోపు అని... కాంగ్రెస్ పార్టీలో ఇక తనదే హవా అని అనుకుంటున్నాడు. నిజానికి రేవంత్ రెడ్డిలాంటి రాజకీయ అనుభవం ఉన్న వాళ్లకు ముందే తెలియాలి. పార్టీలోకి రప్పించుకునేంత వరకూ మన కన్నా తోపు ఎవరూ లేరన్నట్టు మాట్లాడతారు. వన్స్ పార్టీలోకి వచ్చిన తరువాత కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసేస్తారని. మరి ముందు ముందు ఇంకేం జరుగుతుందో చూద్దాం..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-39-78671.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు