ఉగ్రవాదులను స్మగ్లర్లను ప్రభుత్వాలు ఉపేక్షించాలా?

Publish Date:Apr 8, 2015

Advertisement

 

తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఇంచుమించు ఒకే రకమయిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం చాలా విచిత్రమే. తిరుపతి సమీపంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ కారణంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటుంటే, జనగామలో జరిగిన ఎన్కౌంటర్ లో ఉగ్రవాది వికారుద్దీన్ ముఠాని పోలీసులు మట్టుబెట్టడాన్ని తెలంగాణాలో మజ్లీస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే రెండు రాష్ట్రాలలో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయినవారు తీవ్ర నేరానికి పాల్పడిన వారు లేదా పాల్పడుతున్నవారే.

 

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగిలింగ్ ఈరోజు కొత్తగా మొదలయిందేమీ కాదు. అనేక ఏళ్లుగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడిగల వ్యక్తుల అండదండలతో సాగుతూనే ఉంది. వారిలో రాష్ట్రానికి చెందినా కొందరు రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని వార్తలు వచ్చేయి. అయితే ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత కటినంగా వ్యవహరించకపోవడం వలన ఎర్రచందనం స్మగిలింగ్ యదేచ్చగా కొనసాగుతోంది.

 

రాష్ట్ర అటవీ శాఖ లేదా అధీకృత వ్యక్తులు ఇంతవరకు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికిన దాఖలాలు లేవు. కానీ స్మగ్లర్లు మాత్రం నిత్యం ఎర్రచందనం చెట్లను నరికి స్మగిలింగ్ చేస్తూనే ఉన్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు పట్టుకొన్నప్పటికీ రాజకీయ పలుకుబడి గల స్మగ్లర్లు తమిళనాడు నుండి కూలీలను తీసుకువచ్చి మరీ లారీలలో ఎర్రచందనం తరలించగలుగుతున్నారంటే వారు ఎంత బరి తెగించిపోయారో అర్ధమవుతుంది. అంతేగాక తమను అడ్డుకొన్న అటవీ శాఖ సిబ్బందిపై దాడులు చేసి అధికారులను చంపిన సంఘటనలు కూడా గతంలో జరిగాయి. కానీ అప్పుడు ఏ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా స్పందించిన దాఖలాలు లేవు.

 

తమ రాష్ట్రానికి చెందిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిత్యం అరెస్టులు చేస్తున్నప్పుడు కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదన్నట్లు వ్యవహరించింది తప్ప వారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఎన్నడూ చేయలేదు. కానీ ఇప్పుడు అమాయకులయిన తమ కూలీలను ఆంధ్రా పోలీసులు కిరాతకంగా చంపారని తమిళనాడులో రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రభుత్వం, మానవ హక్కుల సంఘాలు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

 

కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుపై నెల్లూరు సరిహద్దులో దుండగులు దాడి చేయడాని కానీ, బస్సులోకి పెట్రోల్ బాంబు విసరడాన్ని కానీ తప్పు పట్టడం లేదు. కనీసం దాని గురించి మాట్లాడలేదు కూడా. మానవ హక్కులు గురించి గొంతు చించుకొని అరుస్తున్న వారు బస్సులో ఉన్న ప్రయాణికులపై పెట్రోల్ బాంబు విసరడాన్ని ఎందుకు తప్పుపట్టడం లేదు అంటే బస్సులో ప్రయాణికులు ఎవరూ చనిపోలేదు గనుక అని సరిపెట్టుకోవలసి ఉంటుందేమో?

 

ఈ ఎన్కౌంటర్లో కూలీలే మరణించి ఉండవచ్చును. కానీ ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నప్పుడు ఇటువంటి పరిణామాలే ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిసే వచ్చేరు. ఒకవేళ వారు తమ స్వంత రాష్ట్రంలోనే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే అప్పుడు తమిళనాడు ప్రభుత్వం వారిని ఉపేక్షిస్తుందని ఎవరూ భావించారు. కానీ అంతమాత్రాన్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం న్యాయమణి సమర్ధించలేము కూడా. కానీ పోలీసులు హెచ్చరించినప్పుడు వారు లొంగిపోయుంటే షరా మామూలుగా వారినందరినీ అరెస్ట్ చేసి ఇంతకు ముందులాగే జైలుకి తరలించేవారు. అప్పుడు ఆ వార్త షరా మామూలుగానే మీడియాలో కనబడేది. కానీ ఈసారి వారు తెగించి ప్రతిదాడులకి పాల్పడటం వలననే తాము ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరపవలసి వచ్చిందని పోలీస్ అధికారులు చెపుతున్న మాట వాస్తవమని నమ్మక తప్పదు.

 

కనుక ఈ సంఘటన నుండి తమిళనాడు ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. ఇప్పటికయినా మేల్కొని తమ రాష్ట్ర కూలీలను ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన కుండా కట్టుదిట్టమయిన చర్యలు చేప్పట్టవలసి ఉంది. ఇక పోలీసులు కూడా రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వానికి భద్రత కల్పించడానికే పరిమితమవ్వాలి తప్ప వారి వలన రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సమస్యలు సృష్టించకూడదు. సున్నితమయిన ఇటువంటి వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరమని ఈ సంఘటన, దాని విపరీత పరిణామాలు తెలియజేస్తున్నాయి.

 

ఇక తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన కరుడుగట్టిన తీవ్రవాది అనేక నేరాలకు పాల్పడిన వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్కౌంటర్ పై కూడా తెలంగాణాలో మజ్లీస్ పార్టీ యంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించడం విస్మయం కలిగిస్తోంది. అటువంటి సంఘ విద్రోహ వ్యక్తులు తప్పించుకొని పారిపోతుంటే పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొని ఉంటే వారు హైదరాబాదులోనే మరొక చోటనో బాంబు ప్రేలుళ్ళకు పాల్పడి అమాయకులయిన ప్రజల ప్రాణాలు బలిగొనకుండా ఊరుకోరని అందరికీ తెలుసు. అందుకే వారి చావుకి ప్రజలెవ్వరూ కించిత్ విచారం వ్యక్తం చేయడం లేదు. కానీ వారు ముస్లిములనే ఏకైక కారణంతో వారిని వెనకేసుకు వస్తే అంతకంటే అవివేకమ మరొకటి ఉండబోదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా వంటి పూర్తి ముస్లిం దేశాలలో ప్రజలణి అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకొంటున్న ఉగ్రవాదులు ఎవరినీ ఉపేక్షించరనే సంగతి తెలిసిన తరువాత కూడా అటువంటి వారికి మతం పేరిట వంతపాడటం అవివేకం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.