హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ

Publish Date:Aug 17, 2024

Advertisement

సీజన్ కాని సీజన్ లోనే వర్షం తన ప్రతాపం చూపిస్తుంది. ఇక తనకంటూ రాసిపెట్టి ఉన్న సీజన్ ఇది. ఇక విజృభించడమే పనిగా పెట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.  హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.  శుక్రవారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  హైదరాబాద్ లోని సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, బోయినపల్లి, బేగంపేట, చిలకలగూడ, మారేడుమిల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి, మేడ్చల్, బాలానగర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో.. అలానే కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది.
సనత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్‌, షాపూర్‌, జగద్గిరిగుట్ట, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, సుచిత్ర ఏరియాల్లో భారీగా వాన కురుస్తోంది. కోఠి, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌, బషీర్‌ బాగ్‌, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్‌, హిమాయత్‌ నగర్‌, చిక్కడపల్లి, నారాయణ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు డ్రైనేజీలు పొంగుతున్నాయి. మురికి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఖాజాగూడ సిగ్నల్, బయోడైవర్సిటీ సిగ్నల్, ఐకియా సిగ్నల్, మల్కం చెరువు, గచ్చిబౌలి ప్రధాన రహదారుల మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
అయితే  హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి కూడా కుండపోత వర్షం కురుస్తుందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వర్షాలు పడతాయని.. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాల కారణంగా ప్రమాదం సంభవిస్తే సహాయం కోసం 040 211 11 111 నంబర్ కి ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని గంటల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.