జగన్ ఘోర పరాజయ పరాభవానికి కారణాలివే?

Publish Date:Jun 8, 2024

Advertisement

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘోర పరాజయం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆయితే తాజా ఎన్నికలలో  జగన్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, ఆ పార్టీకి వచ్చిన సీట్లు మాత్రం మహామహా రాజకీయ పండితులే అచ్చెరువొందేటట్లు చేశాయి.

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న విషయం ఎన్నికలకు చాలా ముందు నుంచే ప్రస్ఫుటంగా కనిపించింది. స్పష్టంగా వినిపించింది. ఇక రాష్ట్రంలో రాబోయే  ప్రభుత్వం ఎవరిదన్నది ప్రీపోల్ సర్వేలు, ఆ తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీ పరాజయాన్ని ముందుగానే ఊహించాయి. అంతెందుకు వైసీపీకి అవును వైసీపీకి మాత్రమే  ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పేసిందని ఎన్నికలకు ముందే వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపించింది.   అసలు ఈ స్థాయిలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరగడానికి కారణమేంటి? సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఎందుకు విఫలమయ్యారు?   ఏ రాష్ట్రంలో అయినా   ప్రభుత్వ సామర్థ్యం, పని తీరు చెప్పడానికి  ఎవరైనా సరే ప్రమాణికంగా తీసుకునే  ప్రధాన అంశాలలో జగన్ దారుణంగా విఫలమయ్యారు.  

 ఆ రాష్ట్ర ఆదాయం (జీడీపీ) పెరుగుదల. తలసరి ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం  మానవాభివృద్ధి   (విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధి కిందకి వస్తాయి.) ఇక, పారిశ్రామిక రంగాల్లో, సర్వీస్ రంగాల్లో ఎదుగుదల ఐదో అంశంగా చెప్పుకోవచ్చు. ఈ అంశంలో  ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు వస్తాయి. అలాగే ప్రజాస్వామ్య స్పూర్తి మరో కీలక అంశంగా పేర్కొనాలి. అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల బలోపేతం లాంటివి అన్నమాట.   

జగన్ ఈ అంశాలన్నిటిలోనూ ఘోరంగా విఫలమయ్యారు.  జగన్ హయంలో రాష్ట్ర జీడీపీ ఘోరంగా దిగజారిపోయింది. తలసరి ఆదాయం ఏడాదికి ఏడాది దిగువకు పడిపోగా.. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక మానవాభివృద్ధిలో తమ సర్కార్ గొప్పగా చేస్తుందని వైసీపీ పెద్దలు ఘనంగా చెప్పుకున్నా వాస్తవం మాత్రం పూర్తి రివర్స్ గా ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి వాటిని పూర్తిగా విస్మరించి కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచి అదే మానవాభివృద్ధిగా జగన్ భావించారు.   విద్య, ఆరోగ్యం విషయంలో ప్రకటనలు తప్ప ఆచరణ కనిపించడం లేదు. 

ఇక, పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగాల్లో అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు రవాణా అంశాలలో జగన్ సర్కార్  సాధించింది శూన్యం. జగన్ హయాంలో ప్రజాస్వామ్య స్పూర్తి  ఇసుమంతైనా కనిపించలేదు.  ప్రభుత్వం ప్రజలతో   సంబంధాలను పూర్తిగా తెంచేసుకుకుంది. అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ  ప్రకారం పాలనా వంటి వాటికి అర్ధమే తెలియదన్నట్లుగా జగన్ పాలన సాగింది.

ఏపీలో అసలు రాజ్యాంగం అమలు కావడం లేదంటూ కోర్టులే పలు సందర్భాలలో చీవాట్లు పెట్టాయి.  గెలిచే వరకూ ప్రజల మధ్యలో ఉన్న జగన్.. గెలిచాక ప్రజలకి మొహం చూపించకుండా పరదాలు కప్పుకు తిరుగుతూ పాలన సాగించారంటేనే జగన్ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్న మాటకు అర్ధమే లేకుండా పోయిందని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది.  పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్ లో సాగింది. కొత్త పరిశ్రమలు రావడం సంగతి అటుంచి ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయాయి.  పెట్టుబడులు శూన్యం, అభివృద్ధి శూన్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన శూన్యం, విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం శూన్యం అన్నట్లుగా రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రంలో పాలన పరిస్థితి తయారైంది. ఇదేమిటని  ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు. ప్రతిపక్ష నేతలు నుండి మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరినీ జగన్ సర్కార్ వేధించింది. వేపుకు తింది.  జగన్ గొప్పగా చెప్పుకున్న సంక్షేమ పథకాలు కూడా  పన్నుల ద్వారా ప్రజల నుండి  వేలల్లో వసూలు చేసి అందులోంచి వందల్లో తిరిగి ఇవ్వడంగానే సాగింది.  

కళ్ల ముందు కనిపిస్తున్న ఈ వాస్తవాలే జగన్ కు గతంలో  ఎవరికీ, ఏ ప్రభుత్వానికీ దక్కనంత ఘోర పరాజయాన్ని అందించింది. అయితే ఇది గుర్తించడానికి సిద్ధంగా లేని జగన్ ఇప్పటికీ నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లేమయ్యాయి? ఏదో కుట్ర జరిగింది అంటూ ఆరోపణలు చేయడం చూస్తుంటే.. జగన్   ప్రజాభిమానాన్ని దక్కించుకుని పార్టీని బతికించుకునే దిశగా అస్సలు ఆలోచనే చేయడం లేదని అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.