మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం ఎందుకంటే?

Publish Date:Aug 21, 2022

Advertisement

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని ఖరారు చేసి చాలా రోజులే అయ్యింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కేసీఆర్ నేడో రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అసలు శనివారం (ఆగస్లు 20)న మునుగోడులో జరిగిన సభలోనే కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అలా భావించానికి కారణం మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభ వేదికగా ప్రకటిస్తారని గతంలో చెప్పారు.

దీంతో అంతా సభా వేదిక మీద నుంచి కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించి, ప్రజలకు ఆయనను పరిచయం చేస్తారని అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్ సభా వేదిక నుంచి మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. కనీసం చూచాయిగా కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని ప్రకటిస్తే తామంతా సహాయ నిరాకరణ చేస్తామని అసంతృప్తి నేతలు ఒక సమావేశం పెట్టి మరీ నిర్ణయించడంతో అభ్యర్థి ప్రకటన వాయిదా పడిందని అంటున్నారు. అసమ్మతి నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. జగదీశ్ రెడ్డితో భేటీ తరువాత కూడా అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతూనే ఉన్నాయి.

మునుగోడుకు చెందిన కొందరు అసమ్మతి నేతలు బీజేపీ గూటికి చేరడమూ జరిగిపోయింది. ఇంకా పలువురు అసమ్మతి నేతలు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని బహిరం సభ వేదికగా ప్రకటిస్తే.. ఆ తరువాత తామూ ఒక సభ పెట్టి తన నిర్ణయాన్ని వెలువరిస్తామని హెచ్చరించినట్లు కూడా చెబుతున్నారు. కేసీఆర్ స్వయంగా అసమ్మతి నేతలతో భేటీ అయ్యి బుజ్జగించినా పూర్తి ఫలితం రాలేదన్నది పార్టీ వర్గాల కథనం.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా బహిరంగ సభ వేదికగా అభ్యర్థి పేరును ప్రకటించలేదని అంటున్నారు. ముందుగా మునుగోడులో కూసుకుంట్ల అభ్యర్థిత్వంపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చిన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషనే వెలువడలేదు.. అప్పుడే అభ్యర్థి ప్రకటనపై తొందర ఎందుకు, వేచి చూసే ధోరణి అవలంబించడం బెటర్ అని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.