రామ్ గోపాల్ వర్మ అతితెలివి.. తగ్గేది లేదంటూనే కాళ్ల బేరాలు!

Publish Date:Nov 29, 2024

Advertisement

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు, క్వాష్ పిటిషన్ల విచారణ వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఆయన అజ్ణాతంలోనే ఉండి కూటమి సర్కార్ ను తనను అరెస్టు చేయవద్దనీ, ఎక్కడకూ పారిపోననీ, సినీమా పనులలో బిజీగా ఉన్నాననీ వేడుకుంటున్నారు. అయితే ఆయన రామ్ గోపాల్ వర్మ కదా? అందుకే ఆ వేడుకోళ్లు, విజ్ణప్తులూ కూడా భిన్నంగా ఒక విధంగా తిరుగుబాటు ధోరణిలో ఉంటున్నాయి. అరెస్టు చేస్తే జైళ్లో ఉండి సినిమా కాథలు రాసుకుంటానంటూ అన్యాపదేశంగానైనా తన అరెస్టు తథ్యమన్న విషయం అంగీకరించేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై దాదాపు 9 కేసులు నమోదయ్యాయి. 

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య, అభ్యంతర పోస్టులు పెట్టినందుకు ఏపీ వ్యాప్తంగా  వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ అజ్ణాతంలోకి వెళ్లారు. పోలీసు నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కోర్టులలో ఊరట లభిస్తుందన్న ఆశతో పరారీలో ఉన్నారు. అజ్ణాతంలో  ఉండగానే ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తనను అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు ప్రతీకార రాజకీయాలు చేస్తారని తాను అనుకోవడం లేదని  చెప్పుకొచ్చారు.

175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లు గెలిచి  ఇప్పటికే ప్రతీకారం తీర్చుసుకున్నారన్న రామ్ గెపాల్ వర్మ.. తన పోస్ట్‌లు,  సినిమాలు కనీసం ఒక్క ఓటును కూడా వారికి వ్యతిరేకంగా ప్రభావితం చేయలేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు తనపై వారు ప్రతీకారం కోసం చూస్తారని బావించడం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకున్నారు. ఓ పక్క తనపై కేసులు సమంజసం కాదని పోలీసులను విమర్శిస్తూనే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్, లోకేష్ లను తనను క్షమించేయమని పరోక్షంగా వేడుకుంటూ, తన వ్యాఖ్యలను జనం ఇసుమంతైనా పట్టించుకోలేదని అంగీకరించేశారు. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే బాబ్బాబు నన్న వదిలేయండని ఆయన పరోక్షంగా ప్రాధేయపడుతున్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై ఆయన చాలా అభ్యంతరకరమైన, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన అరెస్టు తప్పదని తేలిపోయిన తరువాత అతి తెలివి ఉపయోగిస్తూ, తనను ఆదుకోవాలనీ, క్షమించాలనీ పరోక్షంగా నాడు తాను కించపరిచిన వారి కాళ్లా వేళ్లా పడుతున్నట్లు కనిపిస్తోంది.   

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.