Publish Date:Jan 27, 2025
జమ్మూ కాశ్మీర్ లో వరుసగా సంభవిస్తున్న మరణాల మిస్టరీ వీడలేదు. వైద్య నిపుణులు మరణాలకు కారణం న్యూరోట్యాక్సిన్ అని చెబుతున్నారు. కుట్ర కోణం కూడా ఉండి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజౌరీలోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో ఒకే విధమైన ఆరోగ్య సమస్యలతో ఏకంగా 17 మంది మరణించారు. ఈ మృతులంతా మూడు కుటుంబాలకు చెందిన వారే. మృతులలో 14 మంది పిల్లలే.
ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించడానికి 11 మందితో కూడిన బృందం దర్యాప్తు చేస్తున్నది. వైద్య నిపుణులు న్యూరో ట్యాక్సిన్ వల్ల ఈ మరణాలు సంభవించాయని చెబుతున్నప్పటికీ కుట్ర కోణంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులందరూ కూడా ఒకే రకమైన అనారోగ్య లక్షణాలతో మరణించారు. మెదడు వాపు కారణమై ఉండొచ్చని కూడా అంటున్నారు. బాధితుల శాంపిల్స్ లో ఎటువంటి వైరస్, బ్యాక్టీరియాను గుర్తించలేదు. వీరి శాంపిల్స్ పరీక్షించిన పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో మృతులందరిలో మెదడు దెబ్బతినడానికి దోహదం చేసే న్యూరోట్యాక్సిన్ ల ఉనికిని గుర్తించారు.
తాజాగా ఆరుగురు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఈ ఆరుగురినీ ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే దాదాపు 300 మందిని క్వారంటైన్ కు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు, మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని కూడా క్వారంటైన్కు తరలించారు. మొత్తంగా బుధాల్ గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajouli-mystery-deaths-25-191947.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.