నా దారి రహదారి.. రజనీ

Publish Date:May 3, 2023

Advertisement

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ ఏది మాట్లాడినా స్పష్టంగా సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా బెజవాడ వేదికగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించి చెప్పిన మాటలు దానిపై వైసీపీ వర్గాల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే.. విమర్శలను పట్టించుకోననీ, తాను ఏమనుకున్నానో అదే చెప్పానని అన్నారు. నిజమే.. రజనీకాంత్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా హృదయపూర్వకంగానే చెబుతారు. హృదయపూర్వకంగానే మాట్లాడతారు.

అందుకే ఆయన వివాదరహితుడిగా దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో  సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక ఆయన సినిమాలో ఓ డైలాగ్ ఉంది..  ఒక  సారి  చెపితే వంద సార్లు చెప్పినట్లే.. అని.. అది కేవలం సినిమాలకే పరిమితం కాదు.. నిజజీవితంలో కూడా రజనీకాంత్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. తాను మనసా వాచా కర్మణా నమ్మితే తప్ప ఆయన మాట్లాడరు.  ఒకప్పడు  ఆయన రాజకీయ అరంగేట్రం గురించి, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అభిమానుల అభిప్రాయ సేకరణ పేరిట  తమిళనాడులో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. నిజానికి ఒక దశలో ఆయన   ప్రత్యక్ష రాజకీయాల్లోన ఒక కాలు పెట్టారు కూడా. సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించారు.  అయితే రాజకీయాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకున్నాననీ, అందుకే తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించేశారు.  రాజకీయ అరంగేట్రం చేయకుండానే, శుభం కార్డు వేశారు.

ఆ తర్వాత ఆయన సైలెంటై పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల గురుంచి ఆయన ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రాజకీయాలలో ఉన్న వారిలో ఆయనకు మిత్రులు ఉన్నారు. తనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మిత్రుల గురించి ఒక మంచి మాట చెప్పడానికి రజనీకాంత్ ఎప్పుడూ వెనుకాడరు. ఎవరో ఏదో అనుకుంటారనీ, అంటారనీ ఆయన బెదరడు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినా.. అంతకు ముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందని పేర్కొన్నా.. ఆయన తాను ఏది అనుకున్నారో, ఏది నమ్మారో అదే చెప్పారు. వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తనకు నచ్చలేదనీ, అలా చేయడం ద్వారా ఆయనకు అన్యాయం జరిగిందని కుండబద్దలు కొట్టేశారు.

అయితే రజనీ అభిప్రాయంతో వెంకయ్యనాయుడిని అభిమానించే వారే కాదు.. రాజకీయాల గురించి కొద్ది పాటి జ్ణానం, అవగాహన ఉన్న ఎవరైనా ఏకీభవిస్తారు.   వెంకయ్యకు అన్యాయం జరిగిందన్న తన వ్యాఖ్యలు బీజేపీ వారిని నొప్పిస్తాయని తెలిసినా రజనీ వెనుకాడలేదు. తన మనసులో మాట చెప్పేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన వ్యాఖ్యలు వైసీపీకి రుచించవని తెలిసినా తన మనసులో మాట బయటపెట్టడానికి రజనీకాంత్ వెనుకాడలేదు.

తాను నమ్మిన విషయాన్ని చెప్పడానికి ఆయన ఇసుమంతైనా సందేహించలేదు.  అందుకే తన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలను ఆయన లెక్క చేయడం లేదు. ఏదో సామెత చెప్పినట్లు అటువంటి వ్యాఖ్యల వల్ల తన గౌరవానికి ఇసుమంత కూడా భంగం కలగదని ఆయనకు తెలుసు. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.