పోలింగ్ కు ముందు రైతు బంధు! దుబ్బాకలో హజూర్ నగర్ ప్లాన్

Publish Date:Oct 28, 2020

Advertisement

తమకు సవాల్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చివరి అస్త్రంగా రైతు బంధును ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ రైతులకు ఈసారి అందరికన్నా ముందు రైతుబంధు డబ్బులు వేసేలా సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. 

 

నవంబర్‌ 3న పోలింగ్ జరగనుండగా.. అందుకు ఒకటి, రెండు రోజుల ముందు రైతుల అకౌంట్లలోకి నగదు పడేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ప్రగతి భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. అంతేకాదు దుబ్బాక జనానికి ఆసరా పెన్షన్లూ ముందే ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

 

దుబ్బాక నియోజకవర్గంలో 1.82 లక్షల మంది ఓటర్లు ఉండగా వీళ్లలో 60 వేల మంది రైతులున్నారు. ఈ రైతుల్లో రెండు, మూడు ఎకరాల్లోపు వాళ్లే ఎక్కువున్నారు. వీళ్లందరికీ రైతుబంధు ఇవ్వడానికి సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతుందని అధికారులు లెక్కలేసినట్టు తెలిసింది. రాష్ట్రమంతా డబ్బులేయాలంటే రూ. 7,220 కోట్లు కావాలని, ప్రస్తుతం సర్కారు దగ్గర డబ్బుల కొరత ఉందని అధికారుల్లో చర్చ నడుస్తోంది. కాబట్టి ముందు దుబ్బాకకు, విమర్శలు రాకుండా ఇంకొన్ని ప్రాంతాలకు నగదు బదిలీ చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లోనూ అధికార పార్టీకి రైతుబంధు మేలు చేసిందని ప్రచారం ఉంది. కొన్నిచోట్ల ఓటర్లు క్యూలో ఉన్నప్పుడే వాళ్ల అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయని టాక్ ఉంది. 

 

ఈ మధ్య కురిసిన వానలకు వరి, పత్తి, పెసర, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మక్కలను కొనేందుకు సర్కారు ముందుకు రాలేదు. మార్కెట్ లో ధర లేదని, కొనలేమని చేతులెత్తేసింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో దిగొచ్చింది. ఈ విషయంలో దుబ్బాక రైతులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. వాళ్ల కోపం చల్లార్చేందుకు రైతుబంధు సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. పోలింగ్ కు ముందు పథకం సొమ్ము అందిస్తే రైతులు టీఆర్‌‌ఎస్‌‌కు అనుకూలంగా ఓటేస్తారని లీడర్లు అనుకుంటున్నారు.

 

గతేడాది అక్టోబర్‌‌లో హుజూర్‌‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌‌కు ముందు హుజూర్ నగర్ రైతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు రైతుబంధు సాయం అందించారు. వానకాలం సీజన్ బకాయిలను నిధుల కొరత కారణంగా వాయిదా వేసి ఎన్నికల ప్రచారం మొదలైన వెంటనే విడుదల చేశారు. ఓ వైపు ప్రచారం జరుగుతోంటే మరోవైపు రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతుల ఓటింగ్ శాతం పెరిగి టీఆర్ఎస్ క్యాండిడేట్‌‌ గెలిచారని ఇప్పటికి టీఆర్ఎస్ లీడర్లు చెబుతుంటారు.

 

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 10వ తేదీ నాటికి ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తారు. దుబ్బాక సెగ్మెంట్‌లో ఆసరా లబ్ధిదారులు దాదాపు 20 వేల మంది ఉన్నారు.  బై ఎలక్షన్‌ దృష్ట్యా దుబ్బాకలో ఈ పెన్షన్లను ముందే అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీరందరికీ పోలింగ్‌కు ముందు పెన్షన్లు  అందించే చాన్స్ ఉందా అని రూరల్ డెవలప్ మెంట్ అధికారులను ప్రగతిభవన్ వర్గాలు ఆరా తీసినట్టు తెలిసింది.

By
en-us Political News

  
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.