అమెరికాలో మన ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వల్ల దేశ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీ గడ్డపై ఇండియా సమస్యలు, పరిష్కారాల మీద మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి లాభించేది. మోడీ పాలన గురించి విమర్శిస్తే పర్వాలేదు వ్యక్తిగతంగా దూషించడం భారత్ ను చులకన చేసినట్టయ్యింది ఎందుకంటే మోడీ చరిష్మా ఉన్న నేత. ప్రపంచంలో అత్యంత శక్తివంత ప్రధానులలో ఆయన ఒకరు. అటువంటి నేత మీదే రాహుల్ బాణాలు సంధించడం నెగెటివ్ మీనింగ్ వెళుతుంది. భార్యభర్తలు కొట్లాడుకుంటే ఆ గొడవ ఇంట్లో మటుకే పరిమితం చేస్తే బాగుంటుంది. నలుగురికి తెలిస్తే పరువుపోతుంది. మన దేశ జాతీయత భావం మోడీ హాయంలో విపరీతంగా పెరిగింది . ఈ సమయంలో మోడీ మీద రాహుల్ విమర్శ చేయడం వల్ల కాంగ్రెస్ పరువు బజారున పడింది.
మరికొద్ది రోజుల్లో మన ప్రధాని మోడీ అమెరికా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే రాహుల్ అమెరికా చేరుకుని మోడీని విమర్శించడం రాంగ్ మెసేజ్ వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది.
‘‘ప్రధానికి అన్ని తెలుసు అనుకుంటాడు. దేవుని కంటే తాను ఎక్కువ అనుకుంటాడు. దేవుడికే హిత బోధ చేయగలనని’’ భావిస్తాడు అని మోడీని చులకన చేసి మాట్లాడటం మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది. ‘‘ నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాణ్ కోలింగే హమ్ ’’ అంటూ ఫక్తు రాజకీయాలే మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rahul-insulting-nation--39-156287.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది