ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సరిపోదంటున్న రాహుల్.. అసలాయన టార్గెట్ ఎవరంటే?

Publish Date:Aug 6, 2026

Advertisement

నీట్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనల కారణంగా విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  కాక్రోచ్ ల ఉద్యమం విజయం సాధిండంతో.. కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచే దిశగా హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాకుడు రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు.   ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కేవలం ఒక్క మంత్రి రాజీనామాతో సరిపెట్టడంఏమిటని నిలదీస్తున్నారు. దీని  వెనుక ఉన్న అసలు సూత్రధారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

జూలై 20న ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు  బలప్రయోగం చేయడాన్ని లోక్ సభ వేదికగా రాహుల్  ఖండించారు.   పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ నేరుగా హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమిత్ షా  ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై దాడికి దిగారని ఆరోపించారు. భారత భవిష్యత్తు  యువతపై పెల్లెట్లు ప్రయోగించడం దారుణమని, ఈ హింసాత్మక ఘటనలకు అమిత్ షా బాధ్యత వహించి   తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ వేదికగా రాహుల్ చేసిన ఈ డిమాండ్ దుమారం రేపింది.

 కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ వ్యాఖ్యలపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ  డిమాండ్ చేశారు.  మరోవైపు జూలై 21న ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చెప్పులు లేకుండా మెట్లపై కూర్చుని రికార్డు చేసిన 2 నిమిషాల 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 

విద్యార్థులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్ష సందేశం పేరిట విడుదల చేసిన ఆ వీడియోలో.. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం  ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు. నాణ్యమైన విద్య సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని, తరచూ ప్రశ్నపత్రాలు లీక్ కావడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారమౌతోందని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జూలై 25న   ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్   జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో సహా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ 10 జనపథ్ నివాసంలో సమావేశమయ్యారు.

విద్యార్థులు కోరుతున్నది ఉచిత, నాణ్యమైన, పారదర్శకమైన విద్యావ్యవస్థ అనీ, కానీ   ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని విమర్శించారు.  విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియమకాల నుంచి పరీక్షల నిర్వహణ వరకు వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయంటూ రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ  విద్యార్థుల తరఫున పోరాటాన్ని  లోక్ సభలోనూ, వీధుల్లోనూ కూడా మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.  

Rahul Gandhi demand , Amit Shah resignation,  Dharmendra Pradhan Resignation, Student Protests Delhi, Paper Leak Controversy, Lok Sabha Debate 2026

By
en-us Political News

  
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.