కాంగ్రెస్ పార్టీయే రాహుల్ గాంధీకి దిశానిర్దేశం చేయాలేమో?

Publish Date:May 19, 2015

Advertisement

 

రాహుల్ గాంధీ భూసేకరణ చట్టానికి సవరణలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన చేస్తున్న ఈ పోరాటాల గురించి పార్టీలో సీనియర్ నేతలెవరూ అసలు పెదవి విప్పడం లేదు. ప్రతిపక్ష నేతలు ఎవరయినా ఆయనని విమర్శిస్తే అప్పుడు మాత్రం ఏదో మొక్కుబడిగా వాటిని ఖండిస్తున్నారు. అంటే ఆయన చేస్తున్న పోరాటానికి వారి మద్దతు లేదనే విషయం స్పష్టం అవుతోంది.

 

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై అంతర్గతంగా సాగుతున్న చర్చను, పార్టీ శ్రేణులపై దాని ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకే రాహుల్ గాంధీ ఇంత శ్రమపడుతున్నారేమో? బహుశః అందుకే ఆయన ప్రతీ సమస్యకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యుడని నిందిస్తున్నారేమో? ఇప్పుడు దేశ విదేశాలలో మోడీ పేరు మారుమ్రోగిపోతోంది. అటువంటి వ్యక్తిని ఎదిరించడం ద్వారా రాహుల్ గాంధీ తనకూ ఆయనను డ్డీ కొట్టే సాహసం ఉందని నిరూపించుకొని తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఆకట్టుకోవాలని చూస్తున్నారేమో?

 

“రైతుల విషయంలో మోడీ అనుసరిస్తున్న విధానాలకి తను సున్నా మార్కులు వేస్తానని, కానీ కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు సహాయం పడటంలో నూటికి నూరు మార్కులు వేస్తానని” రాహుల్ గాంధీ చెప్పడం చూస్తే తను మోడీకే మార్కులు వేసేంత గొప్పవాడినని చెప్పుకొని తన రాజకీయ అపరిపక్వత చాటుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక రాహుల్ గాంధీ చేస్తున్న ఫ్లయింగ్ పాదయాత్రల వలన ఆ పార్టీకి ఏ ప్రయోజనమూ చేకూర్చలేకపోయినా, పాదయాత్రలు చేసిన ప్రతీ చోట విమర్శల మాత్రం మూటగట్టుకొని వెళుతున్నారు. ఇంతవరకు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ఇప్పుడు తన నియోజక వర్గమయిన అమేధీలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు గురించి పోరాటం చేస్తానని ప్రకటించడాన్ని గమనిస్తే ఆయన పోరాటం ప్రజల కోసమా లేక తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనా? అనే అనుమానం కలుగకమానదు.

 

అక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటుకి తమ యూపీఏ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే, తనపై రాజకీయ కక్షతోనే దానిని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ దానిని తిరిగి సాధించేవరకు తన పోరాటం ఆగదని రాహుల్ గాంధీ ప్రకటించారు. కానీ అక్కడ 2010 సం.లో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వమే అనుమతించిందని, కానీ 2012 సం.వరకు అక్కడ పనులు మొదలుపెట్టకపోవడంతో మళ్ళీ యూపీఏ ప్రభుత్వమే సదరు ప్రమోటర్లకు స్థలం, లైసెన్స్ రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేసిందని కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు జవాబిచ్చారు.

 

ఫుడ్ పార్క్ ఏర్పాటు విషయంలో ఎవరి వాదనలు వారికుండవచ్చును. కానీ 2010లోనే అక్కడ ఫుడ్ పార్కో లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రమో ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వమే అనుమతులు మంజూరు చేసినప్పుడు, దానిని యూపీఏ హాయంలోనే నిర్మాణం పూర్తి చేసేందుకు రాహుల్ గాంధీ ఎందుకు చొరవ తీసుకోలేదు. ఐదేళ్ళ తరువాత కూడా నిర్మాణం కాని సంస్థ గురించి ఆయన ఇప్పుడు ఎందుకు పోరాటం మొదలుపెట్టారు? అని ఆలోచిస్తే ఆయన మొదలుపెట్టిన ఈ పోరాటం దేనికో అర్ధమవుతుంది.

 

కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించలేకనే రాహుల్ గాంధీ రెండు నెలలు శలవు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. తిరిగివచ్చిన తరువాతయినా ముందుగా ఆ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేసి, ఆ తరువాత ఆయన ఎటువంటి పోరాటాలు చేసినా పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచేది. కానీ ఇంటిని చక్క దిద్దుకోకుండా దేశాన్ని చక్క దిద్దేందుకు బయలుదేరితే అప్పుడు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్లు ఉంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేయగలరో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అగమ్యంగా తిరుగుతున్న ఆయనకే పార్టీ దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉన్నట్లు కనబడుతోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.