పాపం...కాంగ్రెస్ పార్టీ!

Publish Date:May 9, 2015

Advertisement

 

కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు నడపాలనే విషయం గురించి రెండు నెలల పాటు విదేశాలలో ఒంటరిగా మేధో మధనం చేసి వచ్చిన రాహుల్ గాంధీ తను స్వయంగా పాదయత్రాలు చేయడం ద్వారా దానిని ‘ఇస్ట్రాంగ్’ చేసుకోవచ్చని ఫిక్స్ అయిపోయి చకచకా నడవడం మొదలుపెట్టారు. మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి చేసిన సవరణల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రచారం చేస్తూ, అదే సమయంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ ముందుకు సాగినట్లయితే ఒకవైపు మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ కొడుతూనే మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రైతులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవచ్చని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. లేదా ప్రజల, మీడియా దృష్టిని ఆకట్టుకోగలిగితే తన నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్న తన పార్టీ నేతల నోళ్ళనును తాత్కాలికంగా అయినా మూయించవచ్చనే ఆలోచన కావచ్చును. కానీ ఆయన మొదలుపెట్టిన పాదయాత్రల వలన పార్టీకి లాభం కలగడం మాటేమో కానీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు.

 

ఆయన డిల్లీలో భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని సభలు నిర్వహించుకొన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసేవారు కాదు. కానీ ఆయన పనిగట్టుకొని వివిధ పార్టీలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో పాదయాత్రలు చేస్తూ, ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి పూనుకోగానే, ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు ఆయనపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

 

తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఈనెల 12న పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించగానే అధికార తెరాస కంటే ముందుగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత పదేళ్ళ పాలనలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే సుమారు 22,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, అప్పుడు అధికారంలో ఉన్న రాహుల్ గాంధీ వారిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు? కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి ఘాటుగా ఒక లేఖ కూడా వ్రాసారు. రైతుల ఈ దుస్థితికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణమని తెరాస వాదిస్తోంది.

 

రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబోయే ఒక్క రోజు పాదయాత్రలో 5 గ్రామాలలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకొన్న 12 మంది రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, స్థానిక కాంగ్రెస్ నేతల తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. దానితో జిల్లాలో మిగిలిన ప్రాంతాలలో ఆత్మహత్యలు చేసుకొన్న అనేక మంది రైతుల కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీని విమర్శించడం మొదలుపెట్టారు. మొక్కుబడిగా ఓ పదిమంది రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించి, రాహుల్ గాంధీ తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న వేలాది రైతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారందరికీ ఆర్ధిక సహాయం అందించడం సాధ్యం కాదు కనుక రాహుల్ గాంధీ కేవలం కొందరిని మాత్రమే కలుస్తున్నారు. అయితే దాని వలన మిగిలిన రైతులలో అసంతృప్తి, ఆగ్రహం కలిగిస్తున్నట్లయింది.

 

రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోయే ఆదిలాబాద్ జిల్లాలోనే 2004-2014 మధ్య కాలంలో  610 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని అధికారిక లెక్కలున్నాయి. వారి ఒక్కో కుటుంబానికి రూ.50,000 రుణమాఫీతో కలిపి మొత్తం రూ.1.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వమే జి.ఓ. నెంబర్: 421 ను జారీ చేసిందని, కానీ వారిలో  ఏ కొద్దిమందికి తప్ప చాల మందికి నేటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆ పరిహారం అందలేదని జిల్లాకు చెందిన బోరన్న అనే రైతు సంఘం నేత చెపుతున్నారు.

 

 అసలు గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలోనే దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారనే విషయాన్ని రాహుల్ గాంధీయే స్వయంగా తన పాదయాత్రలతో బయటపెట్టుకొన్నట్లయింది. మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం పార్టీని బలపరుచుకోవడం మాటెలా ఉన్నా, రాహుల్ గాంధీ తన పాదయాత్రల ద్వారా గత పదేళ్ళ కాంగ్రెస్ నిర్వాకాన్ని ఆయనే స్వయంగా లోకానికి చాటి చెపుతున్నట్లయింది.

 

తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యల లెక్కలు ఇప్పుడు బయటకి వస్తున్నాయంటే అది రాహుల్ గాంధీ పాదయత్రల పుణ్యమేనని చెప్పక తప్పదు. దీని వలన కాంగ్రెస్ పార్టీకి ఏమయినా మేలు జరుగుతుందో లేక మరింత నష్టం జరుగుతుందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి.

 

ఆరు నెలలు గరిడి సాము చేసి ఏమి చేశావయ్యా అంటే మూలనున్న ముసలమ్మని ఒక్క దెబ్బతో పైకి పంపించేసానన్నాడుట వెనుకటికొకడు. రెండు నెలలు విదేశాలలో ఏదో మధనం చేసిన రాహుల్ గాంధీ పని కూడా అచ్చు అలాగే ఉంది. ఇప్పటికే జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ తన పాదయాత్రలతో మళ్ళీ పైకి లేవకుండా శాస్వితంగా భూస్థాపితం చేసేస్తారేమో? పాపం కాంగ్రెస్ పార్టీ!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.