Publish Date:Oct 17, 2018
బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కాంగ్రెస్ కి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. కాంగ్రెస్ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా రాఫెల్ స్కాం అంటూ బీజేపీ మీద విమర్శలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఈమధ్య కాలంలో రాఫెల్ అనే పదం లేకుండా స్పీచ్ ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. కాంగ్రెస్ రాఫెల్ తో బీజేపీని అంతలా టార్గెట్ చేసింది మరి. దానికి తగ్గట్టే రాఫెల్ యుద్ధవిమానాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.
రాఫెల్స్ను తయారుచేసే సంస్థ డసో ఏవియేషన్ తన ఉద్యోగ సంఘాలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలను వెల్లడించే మరో రెండు పత్రాలు తాజాగా లీకయ్యాయి. పోర్టెయిల్ ఏవియేషన్ అనే ఫ్రెంచి వెబ్సైట్ వీటిని బయటపెట్టింది. అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను ఎందుకు తాము భాగస్వామిగా ఎంచుకోవాల్సి వచ్చిందో డసో ఏవియేషన్ డిప్యూటీ సీఈవో లోయిక్ సెగాలెన్ ఇచ్చిన వివరణ ఈ పత్రాల్లో ఉంది. సీఎఫ్డీటీ, సీజీటీ అనే రెండు ట్రేడ్ యూనియన్లతో సెగాలెన్ 2017 మే 11న జరిపిన సమావేశపు మినిట్స్ను పోర్టెయిల్ ఏవియేషన్ ప్రచురించింది. 'డసో రిలయన్స్ ఏరోస్పేస్ పేరుతో నాగ్పుర్లో ఒక సంస్థను ఏర్పాటు చేయడాన్ని వివరిస్తూ.. భారత్కు రాఫెల్ యుద్ధవిమానాల ఎగుమతి కాంట్రాక్టును పొందడం కోసం ఈ పరిహారాన్ని డసో ఏవియేషన్ ఆమోదించడం తప్పనిసరైంది’ అని పేర్కొంది. భారత్లో తయారీని ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో భాగంగా ఇది భారత్ విధించిన తప్పనిసరి పరిణామం అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసం రిలయన్స్తో భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rafale-deal-french-scribe-tweets-document-claims-proof-of-cronyism-39-83925.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.