రాధా గాయత్రి కేసులో కీలక మలుపు...సంచలన ఆడియో!

Publish Date:Jun 22, 2026

Advertisement

 

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విచారణాధికారిని మారుస్తూ ఉత్తరాఖండ్ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసును మరింత పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

ఈ కేసులో స్థానిక ముస్సోరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దేవేంద్ర చౌహాన్ ప్రవర్తించిన తీరుపై మృతురాలి తండ్రి సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నేరుగా ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేథ్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో, డీజీపీ సదరు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిష్టాత్మక కేసు విచారణ బాధ్యతలను సంపూర్ణానంద్ గైరోలా అనే మరో సమర్థుడైన అధికారికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, ఈ దురదృష్టకర ఘటనపై డెహ్రాడూన్ పోలీసులు ఇప్పటికే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్న ఈ టెకీ జంట, ఇటీవల విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. అయితే, జూన్ 15న ముస్సోరిలోని ఒక హోమ్‌స్టేలో రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కుమార్తె మరణం వెనుక అల్లుడి హస్తం ఉందంటూ తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీచరణ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాధా గాయత్రిని మానసికంగా తీవ్రంగా వేధించడమే కాకుండా, ఆమె కదలికలను నిఘా పెట్టేందుకు బ్యాగులో జీపీఎస్ ట్రాకర్‌ను కూడా అమర్చాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను శ్రీచరణ్ తోసిపుచ్చాడు. తామిద్దరం కలిసి రెడ్ వైన్ తాగామని, అనంతరం ఈ ఘటన జరిగిందని శనివారం సింహాచలంలో మీడియా ముందు పేర్కొన్నాడు. కానీ రాధా గాయత్రికి అటువంటి అలవాట్లు లేవని ఆమె స్నేహితులు, బంధువులు స్పష్టం చేస్తున్నారు.

తాజాగా గాయత్రికి సంబంధించిన ఆ ఆడియో బయటకొచ్చింది. రాధా గాయత్రి తల్లి సత్యవతితో మాట్లాడుతూ తన భర్త గురించి చెప్పిన మాటలు ఆడియోలో ఉన్నాయి. భర్త తనను అనుమానిస్తున్నారని.. లిమిట్ దాటిపోయి ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భర్తతో మాట్లాడదలుచుకోలేదని తల్లికి చెప్పి బాధపడ్డారు.

ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీచరణ్ విశాఖపట్నం నుంచి అకస్మాత్తుగా పరారైనట్లు సమాచారం. ముస్సోరిలోని ఘటనా స్థలంలోనూ అతను సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ దారుణ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని, అన్ని కోణాల్లోనూ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేథ్ భరోసా ఇచ్చారు. ఈ కేసులో కొత్త విచారణాధికారి నియామకంతో రాబోయే రోజుల్లో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు.
పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది.
ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన  4 కోట్ల రూపాయల విలువైన   భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో..  అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  
ఈ గ్లోబల్ మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 దేశాలకు చెందిన 12 వేల మందికి పైగా విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలపై ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్ట్ మూల్యాంకన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది బాలికలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న తుది ఎంపిక ప్రక్రియలో ఇండియా నుంచి 20 మంది విద్యార్థినులు స్థానం సంపాదించగా, వారిలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జెస్సీ నిలవడం గర్వకారణం.
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.