Publish Date:Jul 19, 2022
ఇంగ్లీషువారు అందరికీ అంటగట్టింది క్రికెట్ పిచ్చి. దీనికి కులమతాలు, భాషా, దేశ, ప్రాంతీయ విభేదాలేమీ లేవు. క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు, చదువును పక్కన పెట్టే వీరాభిమానులు అనేకమంది. అసలు దేశాల మధ్య విభేదాలను, ద్వేషభావాన్ని తొలగించే శక్తి క్రికెట్కే వుందని ఆమధ్య ఎవరో ఒక రాజకీయవేత్తే అన్నారు. ఇది నిజం. గతంలో పాక్తో భారత్ తలపడిన ప్రపంచకప్ పోటీలో భారత్ గెలిచినపుడు కెప్టెన్ ధోనీని నీ హెయిర్ స్టయిల్ బావుందయ్యా అన్నారు పాక్ ప్రధాని! అంతా ఆశ్చర్యంతో, ఆనందంతో నవ్వుకున్నారు. అలాంటిది ఇంగ్లండ్ లో ఈమధ్య జాతివివక్ష కామెంట్లు వినిపించి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా పోలేదన్నది నిరూపించింది.
ఆ మధ్య ఇంగ్లండ్ ఎడ్గ్బాస్టన్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ జరిగింది. మనవాళ్లు ఎక్కడున్నా ఒకేలా గోల చేస్తారుగదా. అలా భారత్ జట్టు వీరాభిమానుల సంఘం సభ్యులు అక్కడ స్టేడియంలో జాతీయ పతాకం వూపుతూ గోల గోల చేశారు. కారణం భారత్ బ్రహ్మాండంగా ఆడుతున్న సమయమది. భారత్ అనేకాదు, ఎవరి జట్టుకు వారి వీరాభిమానులు అలానే గోల చేస్తుం టారు. ఇది చాలా సహజ దృశ్యం. కానీ తెల్లవారికి మాత్రం ఇలాంటివి బొత్తిగా నచ్చవు. ఇప్పటికీ వారి మనసులు మలినమే. ఇంకా వారిలో జాతివివక్షత ఉంది. ఇలాంటి సమయంలో అది బయటపడుతుంది.
ఎడ్గ్బాస్టన్లో జరిగిన టెస్ట్ నాలుగో రోజు భారత అభిమానులమీద ఆంగ్లేయులు తిట్ల వర్షం కురిపించారు. స్టేడియంలోని హాలీస్ స్టాండ్ వేపు వున్న ఒక భారతీయ ప్రేక్షకుడిని జాతిపేర గట్టిగానే చాలా అసహ్యంగా దూషించాడు ఓ తెల్లవాడు. ఆ దూషణలు విన్న అతని కుటుంబం అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఇది గమనించిన మరి కొందరు ఇంగ్లీషు ప్రేక్షకులు మాత్రం ఆ కుటుంబం జాగ్రత్తగా స్టేడియం బయటికి వెళ్లేందుకు సహాయపడ్డారు.
కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారులు ఈ సంఘటన గురించి వాకబు చేసి ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఊహించనిదని దీన్ని మరీ పెద్దది చేయవద్దని అన్నారు. వారి దేశంలో జరిగింది గనుక వారికి ప్రతిష్టాభంగం కలగకుండా సంఘటనను తొక్కేశారు. ఇంతకంటే దారుణం మరొకటి వుండదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనాగరికం. ప్రపంచ దేశాలు అభివృద్ధి పధంలో ముందడుగు వేస్తున్న కాలంలో ఇంగ్లండ్ లో ఇంకా ఇలాంటి ఆలోచనలు వుండడం మానవసమాజం హర్షించదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/racial-discriminationyet-39-140050.html
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.