Publish Date:Jul 19, 2022
ఇంగ్లీషువారు అందరికీ అంటగట్టింది క్రికెట్ పిచ్చి. దీనికి కులమతాలు, భాషా, దేశ, ప్రాంతీయ విభేదాలేమీ లేవు. క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు, చదువును పక్కన పెట్టే వీరాభిమానులు అనేకమంది. అసలు దేశాల మధ్య విభేదాలను, ద్వేషభావాన్ని తొలగించే శక్తి క్రికెట్కే వుందని ఆమధ్య ఎవరో ఒక రాజకీయవేత్తే అన్నారు. ఇది నిజం. గతంలో పాక్తో భారత్ తలపడిన ప్రపంచకప్ పోటీలో భారత్ గెలిచినపుడు కెప్టెన్ ధోనీని నీ హెయిర్ స్టయిల్ బావుందయ్యా అన్నారు పాక్ ప్రధాని! అంతా ఆశ్చర్యంతో, ఆనందంతో నవ్వుకున్నారు. అలాంటిది ఇంగ్లండ్ లో ఈమధ్య జాతివివక్ష కామెంట్లు వినిపించి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా పోలేదన్నది నిరూపించింది.
ఆ మధ్య ఇంగ్లండ్ ఎడ్గ్బాస్టన్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ జరిగింది. మనవాళ్లు ఎక్కడున్నా ఒకేలా గోల చేస్తారుగదా. అలా భారత్ జట్టు వీరాభిమానుల సంఘం సభ్యులు అక్కడ స్టేడియంలో జాతీయ పతాకం వూపుతూ గోల గోల చేశారు. కారణం భారత్ బ్రహ్మాండంగా ఆడుతున్న సమయమది. భారత్ అనేకాదు, ఎవరి జట్టుకు వారి వీరాభిమానులు అలానే గోల చేస్తుం టారు. ఇది చాలా సహజ దృశ్యం. కానీ తెల్లవారికి మాత్రం ఇలాంటివి బొత్తిగా నచ్చవు. ఇప్పటికీ వారి మనసులు మలినమే. ఇంకా వారిలో జాతివివక్షత ఉంది. ఇలాంటి సమయంలో అది బయటపడుతుంది.
ఎడ్గ్బాస్టన్లో జరిగిన టెస్ట్ నాలుగో రోజు భారత అభిమానులమీద ఆంగ్లేయులు తిట్ల వర్షం కురిపించారు. స్టేడియంలోని హాలీస్ స్టాండ్ వేపు వున్న ఒక భారతీయ ప్రేక్షకుడిని జాతిపేర గట్టిగానే చాలా అసహ్యంగా దూషించాడు ఓ తెల్లవాడు. ఆ దూషణలు విన్న అతని కుటుంబం అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఇది గమనించిన మరి కొందరు ఇంగ్లీషు ప్రేక్షకులు మాత్రం ఆ కుటుంబం జాగ్రత్తగా స్టేడియం బయటికి వెళ్లేందుకు సహాయపడ్డారు.
కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారులు ఈ సంఘటన గురించి వాకబు చేసి ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఊహించనిదని దీన్ని మరీ పెద్దది చేయవద్దని అన్నారు. వారి దేశంలో జరిగింది గనుక వారికి ప్రతిష్టాభంగం కలగకుండా సంఘటనను తొక్కేశారు. ఇంతకంటే దారుణం మరొకటి వుండదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనాగరికం. ప్రపంచ దేశాలు అభివృద్ధి పధంలో ముందడుగు వేస్తున్న కాలంలో ఇంగ్లండ్ లో ఇంకా ఇలాంటి ఆలోచనలు వుండడం మానవసమాజం హర్షించదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/racial-discriminationyet-39-140050.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.