Publish Date:Aug 25, 2022
బ్యాడ్మింటన్ చరిత్రలో పీవీ సింధు కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒలింపిక్స్ లో పతకాలు, కామన్వెల్త్ లో గోల్డ్ సాధించి భేష్ అనిపించుకుంది. ప్రస్తుతానికి లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎన్నో కబుర్లు చెప్పింది సింధు. కొన్నిటికి క్లియర్ గా జవాబులు ఇచ్చింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటికి వచ్చేయడంపై ఒక క్లారిటీ ఇచ్చింది. గోపి సర్ అకాడమీలో చాలా ఏళ్ళు ఆడాను. ఐతే ఆ అకాడమీలో జరిగిన కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు..నాకు సెట్ కావనిపించి వచ్చేసాను. ఒలింపిక్స్ లో ఆడాలంటే కాన్సంట్రేషన్ చాలా అవసరం. ఇలాంటి విషయాలు ఆలోచిస్తే గేమ్ సరిగా ఆడలేను అనిపించింది.
ఈ అకాడమీలో నేను ఎంతో మంది కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా" అని చెప్పింది సింధు. అలాగే తన లైఫ్ లో జరిగిన ఒక బాడ్ ఇన్సిడెంట్ కూడా చెప్పింది సింధు. “2015 లో కాలి నొప్పితోనే ఆరు నెలల పాటు గేమ్ ఆడాను. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఒలింపిక్స్ లోకి వెళ్ళాలి . వెళ్లాలంటే నేను టాప్ - 16 లో ఉండాలి. కానీ అప్పటికి నేను టాప్ - 13 లో ఉన్నా. ఒలింపిక్స్ నా లక్ష్యం కాబట్టి నొప్పిని భరించి ముందుకెళ్లా. ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే పతకం నెగ్గడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.” కష్టడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అర్ధమయ్యింది అని చెప్పింది సింధు. అలాగే ఓనమాలు నేర్పింది ఎవరు అనే ప్రశ్నకు.. “మహబూబ్ అలీ నాకు బ్యాడ్మింటన్ లో ఓనమాలు నేర్పించారు.
తర్వాత ఆరిఫ్, గోవర్థన్, గోపీగారి దగ్గర ట్రైన్ అయ్యాను. ప్రతి ఒక్క కోచ్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుని నా గేమ్ ని ఇంకా మెరుగుపరుచుకున్నాను . ఇండోనేషియా, కొరియాకు చెందిన కోచ్ ల దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఆపొనెంట్ కి నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తాను. మెడల్ గెలిచినప్పుడు పోడియంపై నిల్చుని జాతీయ జెండాను చూస్తూ.. జాతీయ గీతం వింటున్నప్పుడు నాలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. వేరే దేశంలో మన దేశపు జెండా ఎగరడం చాలా గొప్ప విషయం కదా" అంటూ ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పింది సింధు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pv-sindhu-says-quitting-gopichand-academy-39-142623.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యూనిట్ ఇంఛార్జ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.