Publish Date:Aug 18, 2022
పూర్వం అంతటా సంతానలక్ష్ములే ఉండేవారు. దాదాపు ప్రతీ ఇల్లూ పిల్లలతో సందడిగా ఉండేది. కాల క్రమంలో సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇపుడిక ఆధునిక పోకడలవల్ల, సామాజిక పరిస్థితుల వల్లా ఒక్కరి ద్దరితో సరిపెట్టుకుంటున్నారు. రష్యాలో అధ్యక్షుడు పుతిన్ మాత్రం మళ్లీ పిల్లల సందడి అవసరమని భావించారు. అంటే జనాభా పెరుగుదలను ఆశిస్తున్నారు. కారణం కోవిడ్-19 కావచ్చు. కోవిడ్ వల్ల అనేక దేశాల్లో జనాభా తగ్గిపోయింది. రష్యా కూడా దాని ప్రభావానికి గురైంది.
కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన నైరాశ్యంతో కూడిన చిట్టచివరి ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు.
జనాభా క్షీణతను అరికట్టేందుకు పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్ అని పేరు పెట్టారు. ఈ పథకం క్రింద పదిమంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయి తే పది మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి. పదో బిడ్డకు మొదటి పుట్టినరోజు నాటికి ఒక మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉండటం, ఉక్రెయిన్పై యుద్ధం వల్ల మరణించినవారి సంఖ్య 50వేలకు చేరుతుండ టం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
పుతిన్ ప్రకటించిన మదర్ హీరోయిన్ పథకం నైరాశ్యంలో చేపట్టిన అంతిమ ప్రయత్నమని రష్యన్ రాజకీ య, భద్రత రంగాల నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ చెప్పారు. క్షీణిస్తున్న జనాభా సమస్యను పరిష్క రిం చేందుకు దీనిని అమలు చేస్తున్నారన్నారు. పెద్ద కుటుంబాలవారు ఎక్కు వ దేశభక్తిని కలిగి ఉంటారని పుతిన్ చెప్తున్నారని అన్నారు. ఇది సోవియెట్ యూనియన్ కాలంనాటి ప్రోత్సాహకమని చెప్పారు. అయితే ఆర్థిక సాయం కోసం పెట్టిన షరతు వింతగా ఉందన్నారు.
జనాభా తగ్గిపోతుండటం 1990వ దశకం నుంచి ప్రారంభమైందన్నారు. కోవిడ్, ఉక్రెయిన్పై యుద్ధం సమస్యను తీవ్రతరం చేశాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి రష్యన్ మహిళలను ప్రోత్సహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే ఈ డబ్బు కోసం పది మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళంతా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రష్యాలో చాలా ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/putin-offers-rs13lakhs-for-mothers-39-142187.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు