పుష్కరాలపై శవారాజకీయాలేల?

Publish Date:Jul 15, 2015

Advertisement

 

గోదావరి పుష్కరాల తొలిరోజే ఏకంగా 27మంది భక్తులు త్రొక్కిసలాటలో మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది. ఎంత విపత్కర పరిస్థితుల్లో నయినా ఎంతో నిబ్బరంగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట తడిపెట్టి, తన వల్లే ఈ తప్పు జరిగిందని ప్రజలు భావిస్తే క్షమించమని పుష్కర యాత్రికులని కోరడం గమనిస్తే జరిగిన దానికి ఆయన ఎంత బాధ పడుతున్నారో అర్ధం అవుతుంది. ఈ పుష్కరాలకు రాబోయే ప్రజలకి వీలయినంత సౌకర్యంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం కల్పించి పుష్కరాలను ఎంతో గొప్పగా జయప్రదంగా నిర్వహించాలని ఆయన గత నెలరోజులుగా అహర్నిశలు పనిచేస్తూ అధికారులను, మంత్రులను కూడా పరుగులెత్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదంతా ఆయన తన వ్యక్తిగత ప్రచారం కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఆయన ఈ పుష్కరాల ఏర్పాట్ల బాధ్యతలను వేరొకరికి అప్పగించి ఉంటే, అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆయన చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని నిందించకమానవు.

 

ఈ ప్రమాదంలో మృతి చెందినవారి ఒక్కొక్క కుటుంబానికి ఆయన రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే, మనుషుల ప్రాణాలకు ఆయన వెలకడుతున్నరంటూ దానినీ వారు తప్పుపడుతున్నారు. మళ్ళీ వాళ్ళే కనీసం రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి దానినీ తప్పు పడుతున్నారు. ఒకవేళ వేయకపోయుంటే అప్పుడూ ఆయన తప్పుపట్టేవారే. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూసే ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనకు ఆయనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నాయి. కానీ ఇటువంటి కీలక సమయంలో పుష్కరాలకు తరలివస్తున్న ప్రజలకు దైర్యం కల్పించి వారికి అండగా నిలువవలసిన ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేయడం శోచనీయమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

 

పుష్కర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుష్కర ఘడియలు ఆరంభం కాక మునుపే ఆయన కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేయడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని వైకాపా నేతల వాదన. చంద్రబాబు వి.ఐ.పి. ఘాట్ లో పుష్కర స్నానం చేయకుండా కోటగుమ్మం ఘాట్ లో స్నానం చేయడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని జగన్ వాదిస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్ష నేతలు తమ మేధాశక్తికి పదునుబెట్టి రకరకాల కారణాలు వెతికిపట్టుకొని చెప్పడం చూస్తుంటే బోడి గుండుకి మోకాలుకీ ముడేసినట్లుగా ఉంది తప్ప ఈ సమస్యకు అసలు కారణాలను వివరిస్తున్నట్లు లేదు. వారు తమ ఈ మేధాశక్తిని, తర్కాన్ని పుష్కరాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు ఉపయోగించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.

 

అధికార, ప్రతిపక్ష రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు, పుష్కర నిర్వాహకులు విఫలమయ్యారు కనుకనే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం అవుతోంది. కానీ అందుకు పూర్తిగా వారినే బాధ్యులని చేయడం కూడా సరికాదు. ఎందుకంటే పుష్కరాలు మొదలయిన మొదటిరోజే రాజమండ్రిలోకి ఏకంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు ప్రవేశించారు. అంటే అప్పటికే నిండుగా ఉన్న ఆ పట్టణంలోకి మరో పట్టణానికి సరిపోయేంత మంది ప్రజలు ఒకేసారి ప్రవేశించినట్లయింది. మొదటిరోజే అంతమంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించ లేకపోయింది. కనుకనే విఫలమయింది. కానీ ఈ దుర్ఘటన జరిగిన తరువాత పుష్కర నిర్వాహకులు, ప్రభుత్వం చేతులెత్తేయకుండా తక్షణమే మరింత విస్త్రుతమయిన ఏర్పాట్లు చేయడంతో రెండవరోజున కూడా ఇంచుమించు అంతే మంది ప్రజలు వచ్చినా పుష్కరాలు చాలా సజావుగా సాగిపోతున్నాయి. కనుక ఈ పుష్కరాలు పూర్తయ్యే వరకు ప్రతిపక్షాలు ప్రజలలో ఎటువంటి ఆందోళన రేకెత్తించకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరిస్తే బాగుంటుంది. ఆ తరువాత వారు అధికార పార్టీతో, ప్రభుత్వంతో ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండబోదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.