చిత్తూరులో ప్రేమ ఉన్మాదం..

Publish Date:Jun 5, 2021

Advertisement

ప్రాంతం ఏదైనా, ప్రభుత్వాలు ఎన్ని మారిన, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, పేరు ఏదైనా గాని నిత్యం ఆడవారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్తకొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది కసాయిగా మారి ఆ  యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు.
 
ఆమె పేరు సుష్మితకు చిన్నప్పటి నుంచి చదువంటే చచ్చేంత ఇష్టం. అందుకే సుష్మిత అప్పులు చేసి మరీ కూతురిని చదివిచారు. పేద వారమైనా.. ఇరుకు ఇంట్లో ఉంటున్నా ఏనాడూ ఇబ్బంది పడలేదు తాను. చదువే తన సర్వాంగ, చదువే తన కష్టాలు తీరుస్తుందని కష్టపడి చదివింది. కానీ శుక్రవారం ఉదయం సుష్మితను చిన్నా అనే యువడుకు గొంతు కోసి చంపేయగా.. ఆమె కుటుంబసభ్యుల చేతిలో చిన్నా హతమయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరంతో పాటు రాష్ట్రంలోనే తీవ్ర అలజడి సృష్టించింది. ఈ దారుణ ఘటనతో గతంలో జరిగిన ప్రేమోన్మాద దాడులు ప్రజల కళ్లముందు కదలాడాయి. అసలు వివరాలు.. 

చీలాపల్లి సీఎంసీలో  సుష్మిత నర్సుగా పనిచేస్తుంది. డ్యూటీ నిమిత్తం ఆమె సోదరుడు సునీల్‌ రోజూ మధ్యాహ్నం బైక్‌పై తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం ఇంటికి తీసుకొచ్చేవాడు. కట్ చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన  పని లేని ఒక పోరంబోకు, వాడి పేరు చిన్న సుస్మితను కొంతకాలంగా ప్రేమిస్తున్నాను అంటూ, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆయినా వాడి ఆగడాలు ఆగలేదు మళ్ళీ చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో విధులు ముగించుకుని రోజులాగే శుక్రవారం ఉదయం 7.30గంటలకు తన అన్నతో కలిసి సుష్మిత ఇంటికి వచ్చింది. డ్యూటీ చేసి వచ్చిన కూతురికి టీ ఇద్దామని తల్లి తల పాల కోసం కొట్టుకి  వెళ్ళింది. పనిలో పని అని టిఫిక్ కోసం సునీల్ హోటల్‌కు వెళ్లాడు. ఊరు వాతావరణం కదా అప్పటికే  అప్పటికే సుష్మిత ఒంటరిగా ఉందని పసిగట్టిన చిన్న. పధకం ప్రకారం మిద్దెలు దూకుతూ వెళ్లి సుష్మిత ఇంటి మేడపైకి వెళ్ళాడు. వెనుక ఉన్న మెట్లు దిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి గడియను విరగ్గొట్టాడు.

సౌండ్ లేకుండా లోపలి ఎంటర్ అయ్యాడు. సుస్మిత గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా తనకు జరిగిన విషయాలు అన్ని గుర్తుకు చేసుకున్నాడు చిన్న.. ఒక్కసారిగా  మెరుపు దాడి చేసినట్లు గదిలో నిద్రిస్తున్న సుష్మితపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ రక్తపు మడుగులో పడిఉన్న సుస్మిత చూసి మరి ఆ కసాయి వాడు ఏమనుకున్నాడో  అనంతరం అదే గదిలో తానూ కూడా  గొంతు కోసున్నాడు. పాలకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి సుష్మిత, చిన్నా ఇద్దరూ రక్తపుమడుగులో ఉండటంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సునీల్‌ కొనఊపిరితో ఉన్న చిన్నాను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి రాయితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికంగా ఉండే మహిళా సంరక్షణ కార్యదర్శి చిత్తూరు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌ టీం హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించింది. చిన్నాను హతమార్చిన సునీల్‌పై పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By
en-us Political News

  
దెందులూరులో మరోసారి  వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా  చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.