రోడ్డు ప్రమాదంలో నిర్మాత ఆర్బీ చౌదరి కన్నుమూత

Publish Date:May 5, 2026

Advertisement

 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్నిఘటన చోటు చేసుకుంది.  . ప్రముఖ  నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత  ఆర్బీ చౌదరి మంగళవారం (మే 5)   రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు.  దశాబ్దాలుగా దక్షిణ భారత సినీ రంగానికి అపార సేవలు అందించిన ఈ దిగ్గజ నిర్మాత అకస్మాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

రాజస్థాన్ లోని   పర్యాటక నగరంఉదయ్ పూర్  సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి  ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు  ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆర్.బి. చౌదరి పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. ఆయన స్థాపించిన  సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించి అనేక విజయాలు సాధించారు ఆర్బీ చౌదరి. మంచి కథలు, కుటుంబ విలువలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు నిర్మించడం ఆయన ప్రత్యేకత. కొత్త దర్శకులు, నటులకు అవకాశాలు ఇవ్వడంలో ఆయన ముందుండేవారు. చాలా మంది హీరోలు, దర్శకులు ఆయన బ్యానర్ ద్వారా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 

సూర్యవంశం, సుస్వాగతం,రాజు, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, గాడ్ ఫాదర్ వంటి విజయవంతమైన సినిమాలను ఆర్బీ చౌదరి అందించారు.  ఆర్.బి. చౌదరికి నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ప్రముఖ తమిళ నటుడు జీవా సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు. కుటుంబ సభ్యులు కూడా సినీ రంగంతో అనుబంధం కొనసాగిస్తూ ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్.బి. చౌదరి మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తూ   సంతాపం వ్యక్తం చేశారు.  దశాబ్దాల పాటు నాణ్యమైన సినిమాలు అందించిన నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా తమ సంతాప సందేశాలలో పేర్కొన్నారు.  

By
en-us Political News

  
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ స్టార్, 16 ఏళ్ల దీయా యాదవ్‌కు వన్డే జట్టులో చోటు దక్కగా, వరల్డ్ కప్ విన్నర్ భవిక అహిరేకు కెప్టెన్సీ పగ్గాలు లభించాయి. పూర్తి స్క్వాడ్, మ్యాచ్ షెడ్యూల్ ఇక్కడ చూడండి.
కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు గురువారం ఉదయం నుంచే విస్తృతంగా సోదాలు చేపట్టాయి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాలలో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను భారతదేశంలో సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఎలా చూడాలో తెలుసుకోండి. డీడీ స్పోర్ట్స్ ఉచిత లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
జూన్ 11న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్‌లో 100 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 75,200 తగ్గింది. అమెరికా డాలర్ బలోపేతం, గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో తాజా 22k, 24k లైవ్ గోల్డ్ రేట్లు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని రిస్టాడ్ ఎనర్జీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్‌ఎమ్‌ఎస్-1 విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద లాడిల్ నుండి ద్రవ ఉక్కు ఒక్కసారిగా లీకైంది. అయితే.. ఈ లీకేజీ జరిగిన సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
నేటి డిజిటల్ కాలంలో యూపీఐ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ మరియు స్క్రీన్ షేరింగ్ మోసాల నుండి మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎలా కాపాడుకోవాలో, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
కాక్రోచ్ జనతాపార్టీ విడుదల చేసిన ఒక ప్రకనటలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశ యువత అంటే జన్ జీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి భ‌య‌ప‌డ‌టం లేద‌ని పేర్కొంది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ తో గురువారం (జూన్ 11) పూణేలో ఆందోళ‌న చేప‌ట్టింది. ఆ త‌రువాత ల‌క్నో, అమృత్‌స‌ర్‌, బెంగ‌ళూరు, జైపూర్‌, హైద‌రాబాద్‌లో కూడా ఆందోళ‌న‌లు నిర్వహిస్తామనీ, ఈ నెల 13లోగా కేంద్ర మంత్రి రాజీనామా చేయ‌క‌పోతే జూన్ 20న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక ధ‌ర్నా చేప‌డ‌తామ‌ని పేర్కొంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోగా, ఐటీ రంగ షేర్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ బ్యాంకింగ్ రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు యూపీఐ మోసాల వల్ల ఎదురవుతున్న తీవ్ర నష్టాలు మరియు సైబర్ ముప్పుల గురించి బయోక్యాచ్ (BioCatch) తాజా నివేదిక వెల్లడించిన షాకింగ్ గణాంకాలు మీకోసం.
బెంగళూరు నమ్మ మెట్రో ఫేజ్-3 డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయింది. రూ.9700 కోట్ల అదనపు వ్యయంతో ఒకే పిల్లర్‌పై నిర్మించే ఫ్లైఓవర్, మెట్రో రూట్ మ్యాప్ మరియు 32 మీటర్ల ఎత్తైన స్టేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
మమఎర్త్ మాతృసంస్థ హోనాసా కన్స్యూమర్ ఆర్థిక సంవత్సరం 2031 నాటికి రూ.5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రకటించడంతో షేర్లు 6% పైగా పెరిగాయి. ఈ స్టాక్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన తాజా రేటింగ్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.