Publish Date:Jan 22, 2022
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. వాల్డ్ ఫేమస్ సెలబ్రెటీ కపుల్స్. రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నాన్స్టాప్గా న్యూస్లో ఉండేవారు. నిక్ ఫ్యామిలీతో ప్రియాంక చాలా ఈజీగా కలిసిపోయారు. పలు ఫ్యామిలీ ఆల్బమ్స్తో పాపులర్ అయ్యారు. అంతేనా. పెళ్లంటే ఇంతేనా? ఇంకేం లేదా? రెండేళ్లు అవుతోంది.. ఏం గుడ్న్యూస్ లేదా? అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెట్టేశారు. ఆ ప్రశ్నలకు ప్రియాంక నుంచి నో రిప్లై. ఇప్పుడు సడెన్గా తాను తల్లి అయ్యానంటూ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అదేంటి.. ఇంత వరకూ ప్రెగ్నెంటే కాలేదు.. తల్లి ఎలా అయిందబ్బా..అంటూ మరింత ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు తెలిసింది.. కరోగసీ అని.
గ్లోబల్స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దంపతులు అయిన ఈ జంట పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ గుడ్న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘‘సరోగసీ విధానంలో మేం పండంటి బిడ్డకు జన్మనిచ్చాం. మాకెంతో సంతోషాన్నిచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి దయచేసి మా వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నాం’’ అంటూ నిక్, ప్రియాంకా సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘కంగ్రాట్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే వీరికి పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది తెలియజేయలేదు. ఇన్స్టా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయగానే అభిమానులు, స్నేహితులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన తర్వాత ఆమె లాస్ఏంజెల్స్లో సెటిలైంది. ప్రస్తుతం వరుస హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/priyanka-surprise-news-to-fans-39-130550.html
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.