Publish Date:Oct 14, 2019
నిత్యం దేవుడికి దీప ధూప నైవేధ్యాలు పెట్టే పూజారిని దొంగను చేశారు, ఆలయం నుంచి తొలగించి నవ్వులపాలు చేశారు. తనపై దొంగతనం నేరం మోపడంతో ఆ పూజారి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లిలోని శివాలయంలో ధనుంజయచార్యులు పూజారి గా పని చేస్తున్నాడు. అయిదు నెలల క్రితం హుండీ లోని ముప్పై వేల రూపాయలు చోరీకి గురయ్యాయి, ఆ డబ్బును ధనుంజయ్ చార్యులే కాజేసినట్టు ఆరోపణలొచ్చాయి.
ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది, ఆలయ పూజారిగా ధనుంజయ్ చార్యులను తొలగించారు. అప్పట్నుంచీ శివాలయాన్ని నిర్మించిన కాశయ్య అనే వైద్యుడు ధనుంజయ్ చార్యులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ధనుంజయచార్యులు తాగుబోతని, పౌరోహిత్యం రాదని కాశయ్య అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో ధనుంజయచార్యులను పూజలకు పిలవడం మానేశారు, అప్పట్నుంచీ ధనుంజయచార్యులకు కుటుంబ పోషణ కష్టంగా మారింది.
తనపై దొంగతనం నేరం మోపడంతో పాటు తప్పుడు ప్రచారం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ధనుంజయచార్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీశాడు, హుండీ చోరీ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణాలేంటో సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ధనుంజయ్ చార్యులకు భార్య, ఆరు నెలల కొడుకు ఉన్నారు, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటంటూ మృతుడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. మృతుని బంధువులు వైద్యుడు కాశయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ధనంజయ్ చార్యుల ఆత్మహత్యకు కారణమైన కాశయ్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/priest-commits-suicide-in-jayashankar-bhupalpally-district-25-90004.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.